స్పోర్ట్స్

Trending:


రాజకీయాలంటే ఆసక్తి లేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ స్పష్టతనిచ్చాడు. అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తే లేదని తేల్చి చెప్పాడు. అయితే టీమ్‌ఇండియాకు కోచ్‌గా అవకాశం వస్తే మాత్రం అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు తెలిపాడు.


31 పరుగులకే ఆఖరి ఆరు వికెట్లు.. టీమిండియా మళ్లీ అదే చెత్త ఆట!

లీడ్స్‌లో జరుగుతున్న టెస్టులో టీమిండియా మిడిలార్డర్ మరోసారి నిరాశపరిచింది. టాప్ ఆర్డర్ రాణించినా, మిడిల్, టెయిలెండర్లు విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచినా, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. టంగ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. 371 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు...


IND vs ENG: మూడో రోజు వర్షం ఎంట్రీ.. 96 పరుగుల ఆధిక్యంలో భారత్

ENG vs IND Test Score: హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి, ప్రస్తుతం ఇంగ్లాండ్‌పై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (5) త్వరగా ఔటైనా, కేఎల్ రాహుల్ (47 నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది.


ఇంగ్లండ్‌ దీటుగా.. రిషభ్‌ పంత్‌ సెంచరీ

భారత్‌తో లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బంతితో విఫలమైన ఇంగ్లండ్‌.. రెండో రోజు మాత్రం పుంజుకుంది. బంతితో టీమ్‌ఇండియాను కట్టడిచేసిన బెన్‌ స్టోక్స్‌ సేన.. బ్యాట్‌తోనూ తమకు అచ్చొచ్చిన ‘బజ్‌బాల్‌' ఆటతో దీటుగా బదులిస్తున్నది.


Headingley Test | లీడ్స్‌లో భారత్‌కు భంగపాటు.. ఇంగ్లండ్‌ను గెలిపించిన డకెట్, రూట్ ..!

Headingley Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కొత్త సీజన్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. అండర్సన్ - తెండూల్కర్ ట్రోఫీలో హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియా పేసర్లు విఫలమవ్వగా.. 371 పరుగుల లక్ష్యాన్ని స్టోక్స్ సేన అలవోకగా ఛేదించింది.


‘టీమిండియా కోహినూర్ డైమండ్ బుమ్రా’.. మాజీల ప్రశంసలు!

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన.. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి బౌలింగ్ శైలిని టీమిండియా మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, దినేశ్ కార్తిక్ కొనియాడారు. బుమ్రా.. భారత్‌ క్రికెట్ చరిత్రలోనే గొప్ప బౌలర్‌ అని రవిశాస్త్రి అన్నారు. అటు దినేశ్ కార్తిక్ అయితే ఒక అడుగుముందుకేసే.. బుమ్రాను కోహినూర్ డైమండ్‌తో పోల్చాడు.


తొలి టెస్టు డ్రా.. ముగిసిన ఏంజెలొ మాథ్యూస్‌ టెస్టు కెరీర్‌

బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆట ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 177/తో ఆట ఆరంభించిన బంగ్లా.. 285/6 వద్ద డిక్లేర్‌ చేసింది.


ఇంగ్లాండ్ 465 ఆలౌట్.. 5 వికెట్లతో అదరగొట్టిన బుమ్రా.. ఆసక్తికరంగా తొలి టెస్టు

అండర్సన్- తెందుల్కర్ ట్రోఫీలో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మూడో రోజు 209/3 స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్.. దూకుడుగానే ఆడింది. లోయర్ ఆర్డర్, టెయిలెండర్లు కూడా రాణించడంతో భారత స్కోరుకు చేరువైంది. బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.


బూమ్రా ఒంటరి పోరాటం.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు..!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు ధీటుగా బదులిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇంకా 262 పరుగులు వెనకబడి ఉంది. భారత్ పడగొట్టిన మూడు వికెట్లూ కూడా బుమ్రా ఖాతాలోనే పడటం గమనార్హం.


ENG vs IND: డిసైడింగ్ డే.. బుమ్రా పైనే భారం! టీమిండియా గెలుస్తుందా?

టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆఖరి రోజుకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. భారత్ భారీ స్కోరు చేసినా, ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తోంది. వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. గిల్ కెప్టెన్సీ, బౌలర్ల ప్రదర్శనపైనే విజయం ఆధారపడి ఉంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!


ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌

ఒలింపిక్‌ డే రన్‌ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్‌), తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్‌ నిర్వహించారు.


2 బంతుల్లో 7 పరుగులు.. సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ని గెలిపించిన వరుణ్ చక్రవర్తి!

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన సేలం స్పార్టన్స్, దిండిగల్ డ్రాగన్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిండిగల్ జట్టు ఆఖరి బంతికి విజయం సాధించింది. సేలం జట్టు 20 ఓవర్లలో 188 పరుగులు చేయగా, దిండిగల్ జట్టు చివరి ఓవర్లో అద్భుతంగా ఆడి గెలుపొందింది. వరుణ్ చక్రవర్తి చివరి ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


Sourav Ganguly | ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా రాజకీయాల్లోకి వెళ్లను.. గంగూలీ షాకింగ్ కామెంట్స్..!

Sourav Ganguly : మజీ క్రికెటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజకీయాల్లోకి వెళ్తారు. లేదంటే కోచింగ్ బాధ్యతలు చేపడుతారు. పొలిటిక్స్‌లో చేరి మంత్రి లేదంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావాలేగానీ ఎవరైనా 'సై' అంటారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మాత్రం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతున్నాడు.


Nirmal | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.. పీఏసీఎస్ ఛైర్మన్

దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.


BCCI | బెంగళూరు తొక్కిసలాట.. ఐపీఎల్‌ విజయోత్సవాలపై బీసీసీఐ కఠిన నిబంధనలు

BCCI | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట (Bengaluru stampede) ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.


Rishabh Pant: పంత్‌ను త‌ప్పుప‌ట్టిన ఐసీసీ.. అత‌ని ఖాతాలోకి ఓ డీమెరిట్ పాయింట్

Rishabh Pant: అంపైర్ల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించిన కార‌ణంగా.. రిష‌బ్ పంత్‌పై అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి అత‌న్ని మంద‌లించింది. ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలోని లెవ‌ల్ 1 నేరానికి పాల్ప‌డిన‌ట్లు ఐసీసీ పేర్కొన్న‌ది. శిక్ష‌లో భాగంగా అత‌ని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జోడించారు.


భారత జట్ల నిష్క్రమణ!.. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొలీగ్‌

ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐహెచ్‌ లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు దాదాపు నిష్ర్కమించాయి. శనివారం జరిగిన తమ 10వ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-6 తేడాతో బెల్జియం చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది.


వర్షం తర్వాత భారత్‌కు బ్రేక్.. 188 పరుగులకు తొలి వికెట్

Prasidh Krishna | హెడింగ్లే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. వర్షంతో ఆట నిలిచిపోయి, పున: ప్రారంభమైన కాసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ విజయానికి 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆది నుంచే ఆచి తూచి ఆడారు. బెన్ డకెట్ సెంచరీతో రాణించగా, క్రాలీ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, ఫీల్డింగ్ లోపం భారత్‌ జట్టుకు ప్రతికూలంగా మారింది.


Kirsty Coventry | ఐఓసీ చీఫ్‌గా మాజీ ఛాంపియన్.. తొలి ఆఫ్రికా మహిళగా రికార్డు..!

Kirsty Coventry : అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో కొత్త అధ్యాయం మొదలైంది. 133 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఒక మహిళ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో థామస్ బాస్చ్ నుంచి సోమవారం క్రిస్టీ కొవెంట్రీ (Kristy Coventry) బాధ్యతలు స్వీకరించారు.


మేజర్ లీగ్‌లో మళ్లీ ఓడిన సూపర్ కింగ్స్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న మ్యాక్స్‌వెల్ టీమ్!

మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ సత్తా చాటింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 220 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడమ్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ ఒవెన్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో వాషింగ్టన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ మూడో స్థానానికి...


రిషభ్ పంత్ నెక్స్ట్ లెవెల్ మైండ్‌గేమ్.. ఇంగ్లండ్ కీపర్‌ను బోల్తా కొట్టించాడుగా..

హెడింగ్లే వేదికగా ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు బాదారు. అయితే ఈ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ బ్యాటుతో పాటు నోటికి కూాడా పని చెప్పాడు. మైండ్ గేమ్ ఆడి ప్రత్యర్థులను కంగారు పెట్టాడు. తన మాటలతో ఇంగ్లండ్ బౌలర్లను బోల్తా కొట్టించాడు. ఇంతకీ ఏం చేశాడంటే?


Neeraj Chopra | చిన్నప్పుడు బోల్ట్ వీడియోలు చూసేవాడిని.. ఈ సీజన్‌లో నా లక్ష్యమదే..!

Neeraj Chopra : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. 90 మీటర్ల మార్క్ అందుకున్న జావెలిన్ స్టార్.. ప్యారిస్ డైమండ్ లీగ్‌ టైటిల్‌ విజయంతో రికార్డు నెలకొల్పాడు. అంతటితోనే సంతృప్తి చెందకుండా తన తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడీ బడిసె వీరుడు.


బుమ్రా బౌలింగ్‌లో నాలుగు క్యాచ్‌లు మిస్.. జైస్వాల్‌పై ఫ్యాన్స్ ఫైర్!

టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ దీటుగా బదులిచ్చింది. అయితే, భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా జైస్వాల్ క్యాచ్‌లు జారవిడవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా ఐదు వికెట్లు తీసినా, ఫీల్డింగ్ వైఫల్యంతో టీమిండియాకు నిరాశ ఎదురైంది. 'కూర్చొని ఏడవలేం కదా' అని జస్ప్రిత్ బుమ్రా స్పోర్టివ్ స్పిరిట్‌తో...


ముంబైకి పృథ్వీషా వీడ్కోలు

దేశవాళీ రంజీ దిగ్గజం ముంబై జట్టుకు స్టార్‌ క్రికెటర్‌ పృథ్వీషా గుడ్‌బై చెప్పాడు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో పాటు అనవసర వివాదాలతో వార్తల్లోకెక్కిన షా.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ముంబై జట్టును వీడాడు.


ENG vs IND: ఐదో రోజు వరుణుడి ముప్పు.. లీడ్స్‌ను కమ్మేసిన మేఘాలు!

లీడ్స్‌లో జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ తొలి టెస్టు ఆఖరి రోజుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇంగ్లండ్ విజయానికి 350 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ బుమ్రా మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేయాలని చూస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. వరుణుడు కరుణిస్తే ఫలితం తేలే అవకాశం ఉంది.


ఇంగ్లాండ్ గడ్డపై తిలక్ వర్మ సెంచరీ.. భారత టెస్టు జట్టుకు క్లియర్ సిగ్నల్

India Vs England Test series | హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కౌంటీ ఛాంపియన్ షిప్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న తిలక్.. రెడ్‌బాల్ క్రికెట్‌లో చోటే లక్ష్యంగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమ్యయాడు. ఇందులో భాగంగా హాంప్‌షైర్ తరఫున ఆడుతున్న తొలి మ్యాచ్‌లో 239 బంతుల్లో సెంచరీ చేశాడు తిలక్ వర్మ. ఆ తర్వాత కాసేపటికే ఔట్ అయ్యాడు.


SA20 | సెప్టెంబర్‌లో నాలుగో సీజన్‌ వేలం.. రీటైన్‌కు ఆరుగురికే అవకాశం..!

SA20 : ఐపీఎల్ తర్వాత క్రికెటర్లపై కోట్లు కుమ్మరించే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్‌ వేలానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న మెగా వేలానికి సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు.


తేలిపోయిన భారత బౌలర్లు.. హెడింగ్లే టెస్టులో ఇంగ్లాండ్ రికార్డు విజయం!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం కనబరిచినా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్, పంత్ సెంచరీలు చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది.


ICC Breaching Code: రిషభ్ పంత్‌కు షాక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ

హెడింగ్లే వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు టీమిండియా అభిమానులంతా భారత బౌలర్లపైనే భారం వేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌‌లో జస్ప్రీత్ బుమ్రా ఏదైనా మ్యాజిక్ చేయాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అతడు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ మేరకు ఈ స్టార్ బ్యాటర్ చేసిన పనికి మందలించింది. అసలేం జరిగిందంటే?


Headingley Test | రాణించిన రాహుల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్‌ ..!

Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ను 465కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(47 నాటౌట్), సాయి సుదర్శన్(30)లు రాణించారు.


అక్రమ్‌కు స్వర్ణం.. తెలంగాణ షూటింగ్‌ టోర్నీ

గచ్చిబౌలి సాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌ వేదికగా జరుగుతున్న 11వ తెలంగాణ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహమ్మద్‌ అక్రమ్‌ పసిడి పతకంతో మెరిశాడు.


MLC 2025: గెలిచే మ్యాచ్ ఓడిన ఎంఐ.. యూఎస్ఏ లీగ్‌లో పూరన్ సేన పూర్ బ్యాటింగ్!

మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్ మరోసారి నిరాశపరిచింది. కెప్టెన్ పూరన్ సారథ్యంలో జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోతో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శాన్‌ఫ్రాన్సిస్కో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరును ఎంఐ న్యూయార్క్ ఛేదించలేకపోయింది. పూరన్ మరోసారి విఫలం కావడంతో జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ విజయంతో శాన్‌ఫ్రాన్సిస్కో జట్టు టేబుల్ టాప్‌లో కొనసాగగా.. ఎంఐ న్యూయార్క్ జట్టు నాలుగో స్థానంలో ఉంది.


అమ్మాయిల పతక ధమాకా

వియత్నాం వేదికగా జరుగుతున్న అండర్‌-23 ఏషియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు పతక జోరు కనబరిచారు.


Rishabh Pant Centuries: ఇంగ్లండ్‌పై పంత్ రికార్డ్! ఆఖరి ఐదు ఇన్నింగ్స్‌లలో.. మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు!!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. లీడ్స్ టెస్టులో వరుస సెంచరీలు సాధించి జట్టుకు భారీ స్కోర్ అందిస్తున్నాడు. ఇంగ్లండ్‌పై పంత్ ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. పంత్ తన కెరీర్‌లో ఓవరాల్‌గా 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 3200 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు.


తిలక్‌ శతక జోరు

ఇంగ్లండ్‌ కౌంటీల్లో బరిలోకి దిగిన తొలిసారే భారత స్టార్‌ క్రికెటర్‌ ఠాకూర్‌ తిలక్‌వర్మ సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఎసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హంప్‌షైర్‌ తరఫున బరిలోకి తిలక్‌(239 బంతుల్లో 100) శతకంతో విజృంభించాడు.


Rishabh Pant: రికార్డులు బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా ఘనత

హెడింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్ పంత్ రెండు సెంచరీలు సాధించాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా రెండు ఇన్నింగ్స్‌లలో శతకాలు నమోదు చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ రిషభ్ పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.


క్యాచ్‌ డ్రాప్‌లలో జైశ్వాల్ చెత్త రికార్డు.. కోపంతో ఊగిపోయిన సిరాజ్‌!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైశ్వాల్ నాలుగు క్యాచ్‌లు వదిలేశాడు. దీంతో ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు మిస్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. తొలి నాలుగు రోజుల ఆటలో మూడు క్యాచ్‌లు వదిలేసిన జైశ్వాల్.. ఐదో రోజు సైతం ఓ క్యాచ్ మిస్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో బెన్ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. దీంతో సిరాజ్ అసహనం వ్యక్తం చేశాడు.


బ్యాడ్మింటన్‌ హబ్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ మెరువాలనే ఉద్దేశంతో నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చామని ఆయన అన్నారు.


టీమిండియాను ముంచేసిన మిడిలార్డర్.. ఇంగ్లండ్‌‌ను సేవ్ చేసిన అదే మిడిలార్డర్, టేలెండర్స్!

లీడ్స్‌లో జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ తొలి టెస్టులో టీమిండియా మిడిలార్డర్, టేలెండర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ రాణించడంతో 471 పరుగులు చేసిన భారత్ త్వరగా ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ మిడిలార్డర్ రాణించడంతో 465 పరుగులు చేసింది. ఆఖరి ఆరు వికెట్లకు ఇంగ్లండ్ 240 పరుగులు చేస్తే, భారత్ కేవలం 41 పరుగులు మాత్రమే చేసింది. కరుణ్ నాయర్, జడేజా, ఠాకూర్ విఫలం కావడంపై విమర్శలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో అయినా వీరు రాణించాలని అభిమానులు...


Headingley Test | అర్ధ శతకంతో చెలరేగిన పంత్.. రెండొందలు దాటిన ఆధిక్యం..!

Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(73 నాటౌట్) రెచ్చిపోతున్నాడు. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాదేశాడు.


రిషబ్ పంత్ ఫైర్ మోడ్.. వీడియో ఇదిగో! బాల్ విసిరేసి అంపైర్‌పై కోప్పడిన వైస్ కెప్టెన్!!

లీడ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతి మార్పు విషయంలో అంపైర్ నిరాకరించడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. బంతిని నేలకేసి కొట్టి తన నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా కూడా ఈ విషయంలో అంపైర్‌తో ఏకీభవించలేదు. హెడింగ్లీ టెస్టులో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90/2తో ఉంది.


రిషబ్ పంత్ కొత్త స్టైల్ సెలబ్రేషన్స్‌ చూశారా.. దీన్ని ఏమంటారా తెలుసా?

లీడ్స్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత రిషభ్ పంత్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మాములుగా అయితే పంత్ ఇటీవల కాలంలో సెంచరీని సోమర్‌సాల్ట్‌ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. కానీ ఈసారి మాత్రం భిన్నంగా ట్రై చేశాడు. దీంతో పంత్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఏంటి అని సోషల్ మీడియా యూజర్లు వెతకడం ప్రారంభించారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


బుమ్రా ఒక్కడే వికెట్లు తీయాలా..! సిరాజ్‌, ప్రసిద్ధ్‌, శార్దూల్‌లను ఏకిపారేస్తున్న మాజీ క్రికెటర్లు!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రాకు భారత జట్టులోని మిగతా బౌలర్లు సహకరించకపోవడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరీస్‌లో రాణించాలంటే మిగతా బౌలర్లు కచ్చితంగా సహకరించాలని పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే బుమ్రా వర్క్‌లోడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. హెడింగ్లే టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోగా.. అవన్నీ బుమ్రానే తీయడం గమనార్హం.


Headingley Test | కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్, పంత్.. లంచ్ టైమ్‌కి స్కోర్..!

Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది.


RCB తొక్కిసలాట ఎఫెక్ట్.. బీసీసీఐ కొత్త రూల్స్! గెలిచిన వెంటనే విజయోత్సవ ర్యాలీలు లేవు!!

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన బీసీసీఐ, ఐపీఎల్ వేడుకలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నియమాలు అమలు చేయాలని నిర్ణయించింది. వేడుకలకు అనుమతులు, భద్రతపై మార్గదర్శకాలు జారీ చేసింది. ముందస్తు అనుమతితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.


బూమ్ బూమ్ బుమ్రా.. తొలి ఆసియన్ బౌలర్‌గా రికార్డు బద్దలు..!

భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన ఆసియన్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సాధించాడు. మొత్తం 60 ఇన్నింగ్స్‌లో బుమ్రా 148 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే పాక్ వెటరన్ ప్లేయర్ వసీమ్ అక్రమ్ (146)ను అధిగమించాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో భారత్‌కు చెందిన అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ ఉన్నారు.


Headingley Test | రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం..!

Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్ అయింది. హెడింగ్లేలో కేఎల్ రాహుల్(137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) సెంచరీలతో కదం తొక్కగా భారీ స్కోర్ దిశగా పయనించిన టీమిండియా.. టీ సెషన్ తర్వాత అనూహ్యంగా తడబడింది.


IND vs ENG: భారత్‌ 364 ఆలౌట్.. చివరి రోజు ఇంగ్లాండ్ టార్గెట్‌ 350 రన్స్‌

India vs England 1st Test Score | భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలతో భారత్ ఇన్నింగ్స్‌కు పటిష్ట పునాది వేసినా, చివరి సెషన్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. మిగతా బ్యాటర్లు నిలబడలేకపోయారు. చివరి రోజు ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో చూడాలి..!


ఇంగ్లాండ్ గడ్డపై కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలు.. పటిష్ట స్థితిలో భారత్

ఇంగ్లాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ పరుగుల వరద కొనసాగుతోంది. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌ 42 పరుగులకు ఔట్ అయిన ఈ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతక్కొట్టాడు. తన టెస్టు కెరీర్‌లో సెంచరీల సంఖ్యను 9కి పెంచుకున్నాడు. అయితే ఇందులో మూడు సెంచరీలు ఇంగ్లాండ్‌లోనే కొట్టడం గమనార్హం. రాహుల్ సెంచరీతో భారత్.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.


Jasprti Bumrah: ఫ్యాన్స్ అందరి తరఫునా.. బుమ్రాకు భార్యామణి రిక్వెస్ట్..!

ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా పేరు మారుమోగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఐదు టెస్టులు ఆడటంపై సెలెక్టర్లు మొదట్లోనే సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా, బుమ్రా భార్య సంజన గణేశన్ కూడా ఐదు టెస్టులు ఆడాలని కోరింది. పుజారా, గవాస్కర్ కూడా ఇదే విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపింది. మొదటి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీయడంతో చివరి రోజు మ్యాచ్‌లో అతడి మ్యాజిక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.