స్పోర్ట్స్

Trending:


India Squad: సిరాజ్‌, శాంస‌న్ ఔట్‌.. వైస్ కెప్టెన్‌గా గిల్‌.. చాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ఇదే

Team India: చాంపియ‌న్స్ ట్రోఫీలో బుమ్రా ఆడ‌నున్నాడు. అయితే ఇంగ్లండ్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు అత‌ని స్థానంలో హ‌ర్షిత్ రాణాను ఎంపిక చేశారు. 15 మంది స‌భ్యుల జ‌ట్టును ఇవాళ ప్ర‌క‌టించారు. సిరాజ్‌, శాంస‌న్‌కు చోటు ద‌క్క‌లేదు. జైస్వాల్‌ను వ‌న్డేల‌కు ఎంపిక చేశారు.


ఢిల్లీ రంజీ జట్టులో కోహ్లీ..!

కొంతకాలంగా పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్‌ కోహ్లీ.. దేశవాళీలో ఆడాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. 2012 నుంచి కోహ్లీ దేశవాళీలో ఆడలేదు.


సూర్యకుమార్‌ను తప్పించి తప్పుచేశారు.. టీం సెలెక్షన్‌పై రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ లేకపోవడం లోటే అని టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. అతడు ఎక్స్‌ ఫ్యాక్టర్‌లా పనిచేసే వాడని.. నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే వాడని కొనియాడాడు. ఇక రోహిత్ శర్మ కుదురుకుంటే.. భారీ ఇన్నింగ్స్‌లు ఈజీగా ఆడగలడని.. అందుకు వన్డే ప్రపంచకప్ 2019లో ప్రదర్శననే నిదర్శనమని రైనా చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.


మను భాకర్‌ ఇంట విషాదం

మూడు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక ‘ఖేల్త్న్ర’ అవార్డును అందుకున్న ఆనందంలో ఉన్న షూటర్‌ మను భాకర్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను అమ్మమ్మ (సావిత్రి దేవి), మేనమామ (యుధ్వీర్‌) ప్రా ణాలు కోల్పోయారు.


BCCI New Rules Explainer: బీసీసీఐ కొత్త రూల్స్‌లో లాజిక్ ఉందా? అంతా గంభీర్‌ ప్లానేనా? కోహ్లీ, రోహిత్‌కు తిప్పలు తప్పవా?

BCCI New Rules Explainer: బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్స్‌పై సోషల్‌మీడియాలో బిగ్‌ డిబెట్ నడుస్తోంది. ఇంతకీ బీసీసీఐ రూల్స్‌ను ఫ్యాన్స్‌ ఎలా చూస్తున్నారు? విశ్లేషకులు ఏం అంటున్నారో తెలుసుకుందాం!


ఖోఖోలో మనోళ్లే తోపులు.. తొలి ప్రపంచకప్‌లో మహిళల, పురుషుల టైటిల్స్ మనవే

ఖోఖో ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళలు, పురుషులు రెండు విభాగాల్లోనూ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం దిల్లీలో జరిగిన ఫైనల్‌లో తొలుత మహిళల జట్టు 78-40 తేడాతో.. ఆ తర్వాత పురుషుల జట్టు 54-36 తేడాతో నేపాల్‌ జట్లను ఓడించి.. టైటిల్ సాధించాయి. తొలి ఎడిషన్‌లో రెండు విభాగాల్లోనూ టైటిల్ సాధించి ఖోఖో ప్రపంచ విజేతలుగా నిలిచాయి.


U19 World Cup: భారత్‌ అదిరే బోణీ.. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గ్రాండ్ విక్టరీ.. 4 ఓవర్లలోనే..!

అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. ఇవాళ జరిగిన తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. వెస్టిండీస్ నిర్దేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని 26 బంతుల్లోనే ఛేదించింది. దీంతో రెండు పాయింట్లతో పాటు.. భారీగా రన్‌రేట్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో తన తర్వాతి మ్యాచ్‌లలో భారత్‌.. జనవరి 21న మలేషియాతో, 23న శ్రీలంకతో తలపడనుంది.


Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్‌..! పిలుపు వచ్చేదెవరికో..?

Champions Trophy | చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కలిసి జట్టును ప్రకటిస్తారు.


Champions Trophy | దేశవాళీ క్రికెట్‌ ఆడడంలో ప్రయోజనం ఉందా..? కరుణ్‌ నాయర్‌ను ఎంపిక చేయకపోవడం బజ్జీ ఆగ్రహం..!

Champions Trophy | మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) టీమిండియా సెలక్షన్‌ కమిటీపై మండిపడ్డాడు. చాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy)కి కరుణ్ నాయర్‌ (Karun Nair)ను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.


స్వియాటెక్‌ జోరు

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పోలండ్‌ భామ ఇగా స్వియాటెక్‌ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ పోరులో రెండో సీడ్‌ స్వియాటెక్‌ 6-1, 6-0తో ఎమ్మా రదుకాన్‌(బ్రిటన్‌)పై అలవోక విజయం సాధించింది.


Manu Bhaker | షూటర్‌ మను భాకర్‌ ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మామయ్య దుర్మరణం..!

Manu Bhaker | షూటర్‌ మను భాకర్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్‌ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్‌ఖీ దాదరీలోని మహేంద్రగఢ్‌ బైపాస్‌ జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.


Team India | బుమ్రాకు బెర్తు.. హైదరాబాదీ సిరాజ్‌కు చుక్కెదురు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌, పాకిస్థాన్‌ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.


Australian Open: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ డ‌బుల్స్‌లో శ్రీరాం బాలాజీ జోడి ఓట‌మి

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డ‌బుల్స్‌లో ఎన్ శ్రీరాం బాలాజీ, మిగుల్ ఏంజెల్ రియాస్ వ‌రేలా జోడి.. రెండో రౌండ్‌లో ఓడిపోయింది. 6-7 (7), 6-4, 3-6 స్కోరుతో పోర్చుగీస్ జోడి నునో బోర్జెస్, ఫ్రాన్సిస్‌కో కాబ్ర‌ల్ చేతిలో పరాజ‌యం చ‌విచూశారు.


అమ్మాయిల ధనాధన్‌ పోరు

ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్‌గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్‌(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్‌లో భారత్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 02 దాకా జరుగబోయే ఈ టోర్నీలో శనివారం ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఆదివారం వెస్టిండీస్‌ మ్యాచ్‌తో భారత్‌ టైటిల్‌ వేటను ఆరంభించనుంది.


భారత్, ఆస్ట్రేలియా కాదు.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే జట్టేదో చెప్పిన గవాస్కర్

ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఆ జట్టే ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పాడు. సొంతగడ్డపై ఆడటం పాక్‌కు కలిసొచ్చే అంశమని.. ఇలాంటి సందర్భాల్లో పాక్‌ను ఓడించడం కష్టమని వ్యాఖ్యానించాడు. కాగా 2017లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగ్గా.. ఫైనల్లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది.


Rinku Singh-Priya Saroj | ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకు సింగ్‌ నిశ్చితార్థం..? వార్తలపై క్లారిటీ తుఫానీ సరోజ్‌..!

Rinku Singh-Priya Saroj | టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ రింకు సింగ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మచిలీషహర్‌ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం ప్రచారం జరిగింది. ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Rohit Sharma | రంజీల్లో ఆడతారా..? టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏం చెప్పాడంటే..?

Rohit Sharma | రంజీ ట్రోఫీలో ఆడుతారా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఇటీవల వరుస సిరీస్‌లో ఓటమి నేపథ్యంలో ప్రతి క్రికెటర్‌ రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్‌ను మీడియా డొమెస్టిక్‌ క్రికెట్‌పై ప్రశ్నించగా.. హిట్‌మ్యాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.


Neeraj Chopra | ఓ ఇంటివాడైన నీరజ్‌ చోప్రా.. సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌ చేసిన ఒలంపియన్‌ మెడలిస్ట్‌..!

Neeraj Chopra | భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఒలింపియన్‌ మెడలిస్ట్‌ ఆదివారం రహస్యంగా ఆదివారం పెళ్లి చేసుకున్నాడు.


సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదు? గంభీర్‌తో విభేదాలు..? రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే..

Champions Trophy India squad: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపికపై వచ్చిన ప్రశ్నలకు చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ బదులిచ్చాడు. ఇదే సమయంలో గంభీర్‌కు తనకు పొసగడం లేదనే వార్తలపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. ఇదే సమయంలో అజిత్ అగార్కర్.. దేశవాళీలో మెరుగైన క్రికెట్ ఆడినప్పటికీ కరుణ్‌ నాయర్‌కు అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పాడు. శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్సీని సమర్థంగా నిర్వర్తిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.


కర్నాటక X విదర్భ

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ టైటిల్‌ పోరుకు వేళైంది. సీజన్‌ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనలతో ఫైనల్‌ చేరిన కర్నాటక, విదర్భ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న విదర్భ సారథి కరుణ్‌ నాయర్‌ను అడ్డుకోకుంటే కర్నాటకకు తిప్పలు తప్పవు. ఈ టోర్నీలో ఇప్పటికే అతడు 752 పరుగులతో దూకుడుమీదున్నాడు.


Team India | బీసీసీఐ ఆంక్షలతో ఆటగాళ్ల విముఖత..! రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు వైరల్‌

Team Indai | ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy) కోసం బీసీసీఐ (BCCI) శనివారం భారత జట్టును ప్రకటించింది. మీడియా సమావేశంలో (Rohit Sharma), చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇటీవల బీసీసీఐ పది పాయింట్లతో కొత్త పాలసీని తీసుకువచ్చింది. దీనిపై ఆటగాళ్లు ఏమాత్రం సంతోషంగా లేరని రోహిత్‌ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.


ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌ పెళ్లి..!

Rinku Singh Wedding: రింకూ సింగ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా? ఓ ఎంపీతో నిశ్చితార్థం కూడా జరిగిందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్‌, సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌కు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Sanju Samson | సంజు శాంసన్‌ కెరియర్‌ నాశనం చేస్తున్నారన్న శశిథరూర్‌..! ఎంపిక కాకపోవడానికి కారణాలేంటో చెప్పిన కేసీఏ చైర్మన్‌..!

Sanju Samson | రాజకీయాలతో క్రికెటర్‌ యువ ఆటగాడు సంజు శాంసన్‌ కెరియర్‌ను నాశనం చేస్తున్నారని కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఎంపీ శశిథరూర్‌ మండిపడ్డారు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై కేసీఏ చైర్మన్‌ జయేశ్‌ జార్జ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


బుమ్రా ఈజ్‌ బ్యాక్.. షమీ కూడా.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్‌ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు జట్టును ప్రకటించారు. గాయం కారణంగా సిడ్నీ టెస్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధించాడు. శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కుల్‌దీప్‌ యాదవ్‌ తొలిసారి ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్లపై ఎక్కువ ఫోకస్‌ చేసిన సెలక్టర్లు.. 15 మందిలో నలుగురికి చోటు ఇచ్చారు.


Kho Kho World Cup | ఖో ఖో ప్రపంచకప్‌ విజేత భారత్‌..

Kho Kho World Cup | ఖోఖో పురుషుల ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నేపాల్‌ను భారత జట్టు మట్టికరిపించింది. ఖోఖో ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. భారత్‌ తొలి ప్రపంచకప్‌లోనే విజయం సాధించింది.


27 నుంచి తెలంగాణ జిల్లాల క్రికెట్‌ టోర్నీ

ఈనెల 27 నుంచి తెలంగాణ జిల్లాల అండర్‌-17 క్రికెట్‌ టీ20 టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు,


Rohit Sharma | చమటోడుస్తున్న రోహిత్‌ శర్మ.. హార్దిక్‌ పాండ్యాతో కలిసి నెట్స్‌లో సాధన.. Video

Rohit Sharma | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో బ్యాటింగ్‌తో నిరాశ పరిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు కీలకమైన ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొననున్నది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టు, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి హిట్‌మ్యాన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.


Virat Kohli | విరాట్‌ కోహ్లీ రంజీల్లో ఆడుతాడా..? ఢిల్లీ జట్టులో చోటు

Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్‌ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్‌కోట్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆడుతాడా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు.


Suresh Raina | చాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్‌ ఫామ్‌లోకి వస్తడు.. దంచికొడుతడు : సురేశ్‌ రైనా

Suresh Raina | ఇటీవల పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) త్వరలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy) లో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా (Suresh Raina) ఆశాభావం వ్యక్తం చేశాడు. 2019 ప్రపంచకప్‌ తరహాలోనే బ్యాట్‌తో విశ్వరూపం చూపిస్తాడని పేర్కొన్నాడు.


జొకో X అల్కరాజ్‌

ఆధునిక టెన్నిస్‌ దిగ్గజంగా వెలుగొందుతున్న నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), భావి సూపర్‌స్టార్‌గా ఎదుగుతోన్న యువ సంచలనం కార్లొస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యారు. గత రెండేండ్లుగా వింబుల్డన్‌ ఫైనల్స్‌, గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ముఖాముఖి తలపడ్డ జొకో, అల్కరాజ్‌ హైఓల్జేజ్‌ సమరానికి ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ వేదికైంది.


ఐటీఎఫ్‌ విజేత అంకిత జోడీ

ఐటీఎఫ్‌ డబ్ల్యూ50 ఈవెంట్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ అం కితా రైనా అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో అంకిత, నైత బేన్స్‌(బ్రిటన్‌)జోడీ విజేతగా నిలిచింది.


బోణీ అదిరింది

ఐసీసీ మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించింది.


క్రికెట్‌ అభివృద్ధికి బీసీసీఐ భరోసా

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియాను కోరారు.


Champions Trophy | చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేది 2023 ప్రపంచకప్‌ జట్టే..! మారింది నలుగురు ప్లేయర్స్‌ మాత్రమే సుమీ..!

Champions Trophy | ఈ ఏడాది జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, ఇందులో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. దాదాపుగా 2023లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొన్న ఆటగాళ్లు ఉన్నారు. కేవలం నలుగురిని తప్పించి.. వారి స్థానంలో మరో నలుగురికి కొత్తగా స్థానం కల్పించింది. రోహిత్‌, విరాట్‌, జడేజా మూడోసారి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడబోతున్నారు. మిగతా 11 మంది కొత్తగా ఐసీసీ ఈవెంట్‌లో ఆడనున్నారు.


విశ్వవిజేత భారత్‌

దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత్‌ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్‌ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చిన స్వదేశీ క్రీడలో టోర్నీ ఆరంభం నుంచీ అసలు ఓటమన్నదే ఎరుగకుండా సత్తాచాటిన మన క్రీడాకారులు.. ఫైనల్‌లోనూ అదే ఆటతీరుతో తమకు ఎదురేలేదని నిరూపించారు.


ఎదురులేని జొకో

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్పెయిన్‌ సంచలనం కార్లొస్‌ అల్కరాజ్‌ జోరు కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరారు.


Manu Bhaker: మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు.. ఏంజరిగిందంటే..?

Shooter manu bhaker: స్టార్ షూటర్ మనూభాకర్ ఇంట షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.


మెరిసిన క్రీడా రత్నాలు

పలు ప్రతిష్ఠాత్మక క్రీడాటోర్నీల్లో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన క్రీడాకారులకు సముచిత రీతిలో గౌరవం దక్కింది. పారిస్‌(2024) ఒలింపిక్స్‌లో పతకాలతో సత్తాచాటిన వారితో పాటు మెగాటోర్నీల్లో సత్తాచాటిన వారిని కేంద్ర క్రీడాశాఖ ఘనంగా సన్మానించింది.


Karun Nair: ఇదేం కొట్టుడు సామీ... ఇలా కూడా ఆడతారా? బీసీసీఐ పెద్దలూ.. మా వాడి తడాఖా చూస్తున్నారా?

Karun Nair: కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి అన్నట్టు సాగుతోంది కరుణ్‌ నాయర్‌ బ్యాటింగ్‌. విజయ హాజరే ట్రోఫీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నాయర్‌కు సోషల్‌మీడియాలో మద్దతు ఒక రేంజ్‌లో పెరిగిపోతోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు నాయర్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్ చేస్తున్నారు.


Kho Kho World Cup: విశ్వవిజేతగా భారత్‌.. ఖో ఖో ప్రపంచ కప్‌ను భారత మహిళల వశం

Women Team India Gets Kho Kho World Cup Title After Defeat Nepal: క్రీడారంగంలో భారత మహిళలు సత్తా చాటుతున్నారు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ తేడా లేకుండా దుమ్ముదులుపుతున్నారు. ఖోఖో క్రీడలో అత్యద్భుతంగా ఆడి తొలి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుని భారత మహిళలు విశ్వ విజేతలుగా నిలిచారు.


Team India Squad | ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా దూరం.. షమీకి ఛాన్స్‌..!

Team Indai Squad | ఛాంపియన్స్‌ ట్రోఫీతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే జట్టులోకి రానుండగా.. హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను బీసీసీఐ పక్కనపెట్టింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌గా వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత రోహిత్‌, విరాట్‌ వన్డేలు ఆడనున్నారు.


కర్నాటక పాంచ్‌ పటాకా

విజయ్‌ హజారే వన్డే టోర్నీని కర్నాటక రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కర్నాటక 36 పరుగుల తేడాతో విదర్భపై అద్భుత విజయం సాధించింది. కర్నాటక నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యఛేదనలో విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు పరిమితమైంది.


విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక.. ఫైనల్‌లో 100% సక్సెస్‌ రేటు నమోదు

విజయ్ హజారే ట్రోఫీ 2024-2025 టైటిల్‌ను కర్ణాటక గెలుచుకుంది. ఫైనల్‌లో విదర్భను 36 పరుగుల తేడాతో ఓడించి.. ఐదో టైటిల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది. భారీ లక్ష్య చేధనకు దిగిన విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో 779 రన్స్ చేసిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్.. ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.


ఫైనల్లో భారత్‌ ఖో ఖో ప్రపంచకప్‌

అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్‌ మ్యాచ్‌లో మన జట్లు దుమ్మురేపాయి.


ఇంటివాడైన నీరజ్‌ చోప్రా

భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో.. సోనిపట్‌కు చెందిన హిమానిని నీరజ్‌ వివాహమాడాడు.


Priya Saroj MP: రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్‌పై ట్విస్ట్.. ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి రియాక్షన్ ఇదే.. నిజం లేదా?

Rinku Singh Marriage News: రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లి వార్తలపై ఎంపీ తండ్రి తుఫాని సరోజ్ స్పందించారు. ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అయితే పెళ్లి ప్రతిపాదన మాత్రం తమ వద్దకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై తమ ఫ్యామీలీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. దీంతో రింకూ పెళ్లిపై క్లారిటీ వచ్చినట్లయింది. మరి రింకూ సింగ్ కుటుంబం చేసిన ప్రతిపాదనపై సరోజ్ ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.


కరుణ్ నాయర్, సంజూ శాంసన్‌లకు నిరాశ.. జట్టులో చోటు కష్టమే..!

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే ఈ జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇటీవల దేశవాళీ ట్రోఫీలు పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారా లేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. అయితే వీరిద్దరినీ ఎంపిక చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఏషియన్‌ టోర్నీకి చికీత

తెలంగాణ యువ ఆర్చర్‌ తానిపర్తి చికీత సత్తాచాటింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరుపిస్తూ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు కొల్లగొట్టిన చికీత తాజాగా ఏషియన్‌ జూనియర్‌ ఆర్చరీ టోర్నీకి ఎంపికైంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌నకు సెలెక్ట్‌ అయిన చికీత..ఏషియన్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది.


సాత్విక్‌ జోడీ నిష్క్రమణ

ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీలో భారత ప్రస్థానం ముగిసింది. టైటిల్‌పై ఆశలు రేపిన భారత స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి పోరాటానికి సెమీఫైనల్లోనే చుక్కెదురైంది.


ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లోనే అనౌన్స్‌మెంట్‌..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్త ఖరారైంది! శనివారం మధ్యాహ్నం ముంబై వేదికగా జట్టు ప్రకటన ఉండబోతోందని సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లు కలిసి విలేకరుల సమావేశంలో ఆటగాళ్ల పేర్లు వెల్లడించనున్నారు. అయితే ఇందులో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరికి నిరాశ ఎదురవుతుంది? అనేది రేపటితో తేలిపోనుంది.