పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) క్రీడల్లో .. డ్రాగన్ దేశం చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆ జట్టుకు స్వర్ణ పతకం వశమైంది. చైనాకు చెందిన హువాంగ్ యుటింగ్, షెంగ్ లియావో.. గోల్డ్ మెడల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఈవెంట్లోనే దక్షిణ కొరియాకు చెందిన షూటర్లు కీమ్ జీ హియాన్, పార్క్ హ జున్లకు సిల్వర్, కజకస్తాన్కు చెందిన అలెగ్జాండ్రా లీ, ఇస్తామ్ సత్పయేవ్లకు కాంస్య పతకం దక్కాయి.