MOHAMMAD SIRAJ | వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో ఓట‌మి.. క‌న్నీళ్లు పెట్టుకున్న‌ సిరాజ్

Mohammad Siraj : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup 2023) ఫైన‌ల్లో టీమిండియాకు ఊహించిన ప‌రాభ‌వం ఎదురైంది. సొంత అభిమానుల స‌మ‌క్షంలో ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని అందుకోవాల‌నుకున్న రోహిత్ సేన ఆశ‌ల‌కు ఆస్ట్రేలియా(Australia) గండికొట్టింది. దాంతో, టీమిండియా స‌భ్యుల‌తో పాటు కోట్లాదిమంది భార‌తీయులు గుండె ప‌గిలింది.

ఆసీస్ గెలవ‌గానే మైదానంలోనే హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammad Siraj) క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అత‌డిని గ‌మ‌నించిన స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సిరాజ్‌ను ఓదార్చాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

వ‌ర‌ల్డ్ క‌ప్ లీగ్ ద‌శ‌లో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. కీల‌క‌మైన సెమీస్‌లోనూ 2019 ర‌న్న‌ర‌ప్ న్యూజిలాండ్‌ను 70 ప‌రుగుల‌తో చిత్తు చేయ‌డంతో ఈసారి ట్రోఫీ మ‌న‌దే అనుకున్నారంతా. అయితే.. ద‌క్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైన‌ల్ చేర‌డంతో ట్రోఫీ ద‌క్కేనా? అని మ‌న‌సులో సందేహం.

ట్రావిస్ హెడ్‌(137)

అనుకున్న‌ట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓట‌మిపాలైంది. అహ్మాదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో భార‌త్ త‌డ‌బ‌డింది. ఆసీస్ పేస‌ర్ల విజృంభ‌ణ‌తో 240 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఆదిలోనే మూడు కీల‌క వికెట్లు తీసిన‌ప్ప‌టికీ ట్రావిస్ హెడ్‌(137), మార్న‌స్ ల‌బూషేన్(58 నాటౌట్) గోడ‌లా నిల‌బడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ క‌ప్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయింది.

ఇవి కూడా చ‌ద‌వండి

2023-11-20T04:32:14Z dg43tfdfdgfd