ఐపీఎల్ 2024లో లీగ్ స్టేజ్ ముగిసేందుకు సమయం దగ్గరవుతోంది. ఇప్పటివరకు 56 మ్యాచులు పూర్తయ్యాయి. లీగ్ దశలో మరో 14 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ కూడా ఒక్క జట్టూ కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. దీంతో ప్రతి జట్టూ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రతీ మ్యాచూ కీలకంగా మారిన నేపథ్యంలో మ్యాచులో చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వొద్దని జట్లు ప్లాన్ చేస్తున్నాయి. ఈ దశలో అంపైరింగ్ నిర్ణయాలు వివాదాలను రాజేస్తున్నాయి. లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకోవడం, ప్లే ఆఫ్స్ సమీపిస్తుండటంతో అంపైర్లు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆయా జట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో సంజూ శాంసన్పై ఔట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ప్లేయర్ షై హోప్ అందుకున్న క్యాచ్పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంతిని అందుకున్న తర్వాత.. హోప్ బౌండరీ లైన్ను తాకాడని, కానీ అంపైర్ ఔట్ అని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఈ నిర్ణయంతో రాజస్థాన్ రాయల్స్.. మ్యాచులో ఓడిపోయందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ నవ్జ్యోత్ సిద్ధూ సైతం స్పందించారు. అంపైర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చాడు.
‘శాంసన్ ఔట్పై అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఢిల్లీ విజయానికి కారణమైంది. సైడ్ యాంగిల్ నుంచి చూస్తే.. షై హోప్ కాలు.. బౌండరీ లైన్ను తాకుతున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. ఈ తరహా ఘటనలతోనే టెక్నాలజీని సరిగా వినియోగించడం లేదా అనే అనుమానాలు తలెత్తుతాయి’ అని సిద్ధూ అన్నారు.
‘ఒక్కసారి కాదు. షై హోప్ రెండు సార్లు బౌండరీ లైన్ను తాకాడు. నిబంధనలు ఎలా ఉన్నాగానీ.. కళ్లు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. క్లియర్గా కనిపిస్తున్నప్పుడు దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. అయితే, అంపైర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని నేను భావించడం లేదు. కానీ, ఆ ఔట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.
క్యాచ్కు సంబంధించిన రీప్లేలను మరికొన్ని కోణాల్లో చూసి ఉంటే బాగుండేదని.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్వుడ్ అభిప్రాయపడ్డాడు. కాస్త సమయం తీసుకుని.. నిదానంగా పరిశీలిస్తే ఈ వివాదం చెలరేగేది కాదని చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ఈ వివాదంపై స్పందించాడు. హైప్ క్యాచ్ పట్టుకున్నాడు అనే క్యాప్షన్ ఇచ్చి.. ఫొటోను పోస్ట్ చేసింది.
కాగా మంగళవారం జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 221/8 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ను 201/8 కు పరిమితం చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-08T10:10:27Z dg43tfdfdgfd