స్పోర్ట్స్

Trending:


Team Indiaకు బిగ్ షాక్.. టెస్టు క్రికెట్‌కు కోహ్లి రిటైర్మెంట్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా నేరుగా బీసీసీఐ ప్రతినిధులకే కోహ్లి చెప్పాడంట. అయితే కీలకమైన ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో కోహ్లిని మరోసారి ఆలోచించుకోవాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. కానీ కోహ్లి నుంచి ఎలాంటి సమాధానం లేదు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి సడెన్ డెసిషన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌ని ఇచ్చింది.


ఐపీఎల్ 2025 బిగ్ అప్‌డేట్! దేశం తర్వాతే క్రికెట్.. తేల్చిచెప్పిన బీసీసీఐ!!

ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రికత్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025ను రద్దు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి అప్‌డేట్ అందిస్తామని పేర్కొంది. దేశం తర్వాతే తమకు ఏదైనా అని బీసీసీఐ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. ఐపీఎల్ భాగస్వాములు, ఫ్రాంఛైజీలతో మాట్లాడిన తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్...


IPLపై WTC ఫైనల్ ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ డౌటేనా?

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3వ తేదీ జరగనుంది. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11న నిర్వహించాలని ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్‌కు చేరుకునే టీమ్స్‌లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ ఉన్న జట్లు ప్లాన్-బిని రెడీ చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులతో పాటు ప్లేయర్లు కూడా ఎలాంటి నిర్ణయం...


దుబాయ్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్! భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ పీసీబీ నిర్ణయం!!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. పీఎస్ఎల్‌లో మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రావల్పిండి, ముల్తాన్, లాహోర్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌లను భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ దుబాయ్‌కి మారుస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడే ఆటగాళ్లు దుబాయ్ వెళ్లనున్నారు. దుబాయ్‌లో ఆరు రోజుల తర్వాత పీఎస్ఎల్ మిగతా...


IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫారెన్ ప్లేయర్సంతా ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు!

దేశీ ప్లేయర్లను భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే పనిలో పడ్డాయి ఫ్రాంఛైజీలు. విదేశీ ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్‌ను కూడా వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకు రావడానికి ఆయా ఫ్రాంఛైజీలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్ రేసులో ఉన్న పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీలు ఆయా ప్లేయర్లతో మంతనాలు జరుపుతోంది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ టాప్ 4 ప్లేస్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,...


జై హింద్ నినాదాలతో హోరెత్తించిన క్రికెటర్లు.. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్!

పాకిస్తాన్ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతగా తిప్పికొట్టడంతో టీమిండియా క్రికెటర్లు జై హింద్ నినాదాలతో హోరెత్తించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్యా సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ పోస్టులు చేశారు. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న బోర్డర్‌లోని సైనికులకు రోహిత్ శర్మ భార్య రితిక, విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ పోస్టులు చేశారు.


క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌.. వన్డే క్రికెట్‌లో మంధాన అరుదైన ఫీట్‌..!

మహిళల వన్డే క్రికెట్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 92 బంతుల్లో సెంచరీ చేసిన మంధాన.. తన ఖాతాలో 11వ వన్డే సెంచరీని వేసుకుంది. మంధాన చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌.. ట్రై సిరీస్ ఫైనల్‌లో శ్రీలంకను 97 పరుగుల తేడాతో ఓడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న కోహ్లి.. ఆ రికార్డుల్లో సంగక్కరే లాస్ట్!

విరాట్ కోహ్లి ఇంకో 770 పరుగులు చేసుంటే.. ఓ అరుదైన రికార్డు అందుకునే వాడు. టెస్టు క్రికెట్‌‌కి సడెన్‌గా రిటైర్మెంట్ పలకడంతో కుమార సంగక్కర తర్వాత మరో ఆటగాడు ఈ రికార్డును ఇప్పటి వరకు అందుకోలేక పోయినట్టయింది. ఇంటర్నేషన్ క్రికెట్‌లో కుమార సంగక్కరనే చివరగా అటు వన్డే, ఇటు టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సంగక్కర 2015లో క్రికెట్‌కు రిటైర్మెంట్ పలకగా.. అప్పటి నుంచి మరో ఆటగాడు రెండు ఫార్మాట్లలో పది వేల పరుగులు చేయలేకపోయాడు.


టెస్ట్ క్రికెట్‌కు కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ కోరినా వెనక్కి తగ్గని విరాట్.. కారణం ఇదేనా..?

Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాతి నుంచి కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ, సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సముఖంగా లేని బీసీసీఐ.. అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించింది! కానీ తన మనసు మార్చుకోని కోహ్లీ.. టెస్టులకు రిటైర్మెంట్ పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు...


రిటైర్మెంట్ వార్తల వేళ.. కోహ్లీకి బ్రియాన్ లారా మెసేజ్..!

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పకూడదని.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వ్యాఖ్యానించారు. కోహ్లీ రిటైర్మెంట్‌పై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడు సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టారు. టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అవసరం ఉందని.. లారా కొనియాడారు. అతడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, హిట్ మ్యాట్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిిసిందే..


ఇక జన్మలో పాకిస్థాన్ వెళ్లను.. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వచ్చిన విదేశీ ప్లేయర్లు తిరిగి వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొపాకుల మోత మధ్య ప్రయాణసాగించిన వీరు.. ఎట్టకేలకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే తాను మళ్లీ పాక్‌కు వెళ్లబోనని డేరిల్ మిచెల్ వ్యాఖ్యానించాడు.


పాకిస్తాన్‌కు ఘోర అవమానం.. మా దేశంలో పాకిస్తాన్ లీగ్ వద్దన్న దుబాయ్! పీఎస్ఎల్ వాయిదా పడినట్టే!!

దుబాయ్ వేదికగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు చెప్పిన తర్వాత రోజే బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతించలేదు. భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో తమ దేశంలో లీగ్ అనుమతించబోమని దుబాయ్ తేల్చి చెప్పేసింది. దాంతో దాదాపు పాకిస్తాన్ సూపర్ లీగ్ వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. బీసీసీఐ - ఈసీబీకి ఉన్న సత్సంబంధాలతోనే పాక్ లీగ్‌కు అనుమతి కుదర్లేదని తెలుస్తోంది.


కుక్క తోక వంకర.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో వార్

Virender Sehwag: కాల్పుల విరమణ అంటూ చర్చలకు ముందుకొచ్చి.. మళ్లీ తన వక్రబుద్ధిని చూపిస్తున్న పాకిస్థాన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు విమర్శలు గుప్పించారు. కుక్క తోక ఎప్పుడూ వంకరే అంటూ వ్యంగ్యాత్మక పోస్టును షేర్ చేశారు. పాకిస్తాన్ మద్దతుదారులు వీరేంద్ర సెహ్వాగ్‌ను తీవ్ర స్థాయిలో దూషిస్తూ కామెంట్లు పెడుతుండగా.. భారత అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.


WTC Final: భారత్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. తొలిసారి ఇంగ్లాండ్ బయట..!

WTC Final 2027: ఇప్పటివరకూ ఇంగ్లాండ్‌లోని క్రికెట్ స్టేడియాల్లోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. రెండు ఫైనల్స్ ఇదివరకే పూర్తికాగా.. మూడో ఫైనల్ వచ్చే నెలలో లార్డ్‌ వేదికగా జరగనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 ఫైనల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించి బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందట.


WTC ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టు.. ఆరుగురు పేసర్లతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు రెడీ

World Test Championship final 2025: జూన్ 11 నుంచి ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్.. తమ జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా ఆరుగురు పేసర్లకు చోటు కల్పించింది. అటు ఆస్ట్రేలియా కూడా తమ టీమ్‌ను అనౌన్స్ చేసింది.


ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ వచ్చేసిందోచ్.. 6 వేదికల్లో మ్యాచ్‌లు, హైదరాబాద్‌ వాసులకు నిరాశ..!

ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించి రీషెడ్యూల్ వచ్చేసింది. మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు కాగా.. ప్లే ఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌లకు ఇంకా వేదికలు ఫిక్స్ కాలేదు.


క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వారం కంటే ముందే ఐపీఎల్ పునఃప్రారంభం!

ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారత్‌-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వారం పాటు వాయిదా పడ్డ లీగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో మ్యాచ్‌లను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


ఇంగ్లండ్‌లో ఐపీఎల్ 2025? బీసీసీఐకి బంపర్ ఆఫర్!

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద కూడా పడింది. ఐపీఎల్ 2025ను ఓ వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కూడా అప్పటి పరిస్థితుల ఆధారంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయని బీసీసీఐ స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025ను ఇంగ్లండ్‌లో నిర్వహించుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఆఫర్ ఇచ్చింది.


‘ఎందుకిలా చేశావ్ కింగ్‌..!’.. కోహ్లీ రిటైర్మెంట్‌పై మాజీలు, ఫ్యాన్స్ ఆశ్చర్యం

విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై అతడి ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు 39 ఏళ్ల వరకూ టెస్టు క్రికెట్ ఆడారని గుర్తు చేసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్.. ఇంత త్వరగా వీడ్కోలు పలకడమేంటని షాక్ అవుతున్నారు. కోహ్లీ నిర్ణయం అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.


IPL ప్లేఆఫ్స్‌కు ముందు టాప్ జట్లకు షాక్.. అంతా తలకిందులు.. స్టార్ ప్లేయర్స్ దూరం, మారిన ఛాన్సెస్

IPL 2025 Playoff Race: ఎన్నో ఆటంకాలను అధిగమించి ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ దశకు చేరుకుంటున్న సమయంలో, పలు ఫ్రాంచైజీలకు ఊహించని ఎదురుదెబ్బ తగలనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సహా వెస్టిండీస్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కారణంగా పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే నిష్క్రమించనున్నారు. హేజిల్‌వుడ్, బట్లర్, స్టార్క్ వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశాలు లేకపోవడంతో.. ప్లేఆఫ్ రేసులో ఉన్న జట్ల సమతూకం దెబ్బతిననుంది.


IPL: పంజాబ్ vs ఢిల్లీ కాదు.. ఆర్సీబీ మ్యాచ్‌తోనే గేమ్ రీ స్టార్ట్!

ఐపీఎల్ 2025 మే 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఆగిపోయిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌తో సీజన్‌ను రీ స్టార్ట్ చేయనున్నారు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మే 24న నిర్వహించనున్నారు. మే 17 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐపీఎల్ 2025 కొనసాగనుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్స్ కోసం ఇంకా అధికారికంగా వేదికలను ప్రకటించలేదు.


చిరకాల కోరిక నెరవేరకముందే కోహ్లీ నిష్క్రమణ.. టెస్టుల్లో!

14 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశాడు. సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన విరాట్.. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో రారాజుగా నిలిచాడు. అయితే తన కోరిక నెరవేర్చుకోకుండానే కోహ్లీ టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ చేయడమే తన లక్ష్యమని 11 ఏళ్ల క్రితం చెప్పిన విరాట్.. 770 రన్స్ దూరంలో నిలిచిపోయాడు.


కోహ్లీ vs సచిన్.. రిటైర్మెంట్ నాటికి ఎవరు ఎలా.. పరుగులు, సెంచరీలు సహా ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Kohli Sachin Test Records Comparison: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కోహ్లీ.. టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని తెలిపాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో పోలిస్తే.. రిటైర్మెంట్ నాటికి ఇద్దరి గణాంకాల్ని మనం ఓసారి పోల్చి చూద్దాం. మ్యాచ్‌లు, పరుగులు రెండింట్లోనూ కోహ్లీ వెనుకబడ్డాడు.


IPL ప్లేయర్ల కోసం స్పెషల్ ట్రైన్స్! భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ బీసీసీఐ నిర్ణయం!!

భారత్ - పాక్ మధ్య గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడింది. దాంతో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్, కెమెరా మెన్స్, కామెంటేటర్స్ అందర్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. వీళ్లందర్ని ప్రత్యేక ట్రైన్లలో తరలిస్తున్నారు. గగనతలంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రైలు...


త్వరలోనే ఐపీఎల్ పునఃప్రారంభం.. పాక్‌ తోక ముడుస్తుంది: సౌరవ్ గంగూలీ

వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 త్వరలోనే పునఃప్రారంభం అవుతుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పారు. పాకిస్థాన్‌ ఎక్కువ కాలం ఒత్తిడిని తట్టుకోలేదని.. త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని పేర్కొన్నారు. కాగా భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలతో ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ.. శుక్రవారం ప్రకటించింది.


భారత్- పాక్ కాల్పుల విరమణ.. ఆ 3 వేదికల్లో ఐపీఎల్‌ 2025 మిగతా మ్యాచ్‌‌లు? లిస్టులో హైదరాబాద్‌!

3 Venues of IPL 2025: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగితే ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లను ఇదే నెలలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు మూడు నగరాలను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వేదికగా మిగతా టోర్నీని పూర్తి చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు భారత ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటుంది.


LSG vs RCB: ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ పరిస్థితి ఇదే!

పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దయిన వెంటనే బీసీసీఐ అధికారులు ఓ సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ ప్యానల్‌తో ఈ రోజు కీలక భేటీ అవ్వనున్నారు. ఈ భేటీలో ఐపీఎల్ 2025 మిగతా షెడ్యూల్‌పై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ జరగాల్సిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సస్పెన్స్‌లో పడింది. ఒకవేళ మ్యాచ్‌ను రద్దు చేస్తే ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కనుంది. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్...


PBKS-DC: వందే భారత్ ట్రైన్‌లో పంజాబ్-ఢిల్లీ ప్లేయర్లు.. వీడియో ఇదిగో!

భారత్ - పాక్ మధ్య ఉద్రికత్తలు నెలకొనడంతో పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, గగనతలంలో ఆంక్షలు విధించడంతో ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, అంపైర్లు, బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది అందరూ ధర్మశాల నుంచి ప్రత్యేక ట్రైన్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. వీళ్లందరి కోసం భారత ప్రభుత్వం, బీసీసీఐ స్పెషల్ వందే భారత్ ట్రైన్‌ని ఏర్పాటు చేసింది. ఆ వీడియోని ఐపీఎల్ తాజాగా పోస్ట్ చేసింది.


IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్

IPL 2025 Reschedule: మొన్న యుద్ధం మొదలైంది. ఐపీఎల్ ఆగింది. ఇప్పుడు యుద్ధం ఆగింది. ఐపీఎల్ ప్రారంభం కానుంది. త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ 18 కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


బృందావనంలో విరాట్ కోహ్లి-అనుష్క శర్మ! రిటైర్మెంట్ తర్వాత తొలిసారి ప్రేమానంద్ జీ ఆశ్రమానికి!!

విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌ను సందర్శించాడు. ఈ సందర్భంగా ప్రేమానంద్ జీ అనుష్క శర్మ - విరాట్ కోహ్లి దంపతులకు ఆశీర్వాదం అందించారు. కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో కోహ్లి ఇలా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతుంటాడు. గతంలో కూడా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ తర్వాత జనవరిలో ప్రేమానంద్ జీని కోహ్లి సందర్శించాడు. తాజాగా మళ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత బృందావనానికి వచ్చాడు.


Indian Players | ఆపరేషన్‌ సిందూర్‌పై భారత్ ఆటగాళ్లు కామెంట్స్

భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకుండా దేశ పౌరులుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంది.


IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

IPL 2025: భారత్ పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు నేడు సమావేశం అయిన బీసీసీఐ ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో దేశంతో నిలవాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది.


రోహిత్, కోహ్లీ మరో వన్డే ప్రపంచకప్ ఆడలేరు: సునీల్ గవాస్కర్‌

టెస్టు ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై సునీల్ గావస్కర్ స్పందించారు. వారిద్దరూ సెలక్టర్లతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. అయిేత వారిద్దరూ వన్డే ప్రపంచకప్‌ 2027 వరకూ ఆడతారా? లేదా అనే విషయంపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగబోరని జోస్యం చెప్పారు.


Virat Kohli Test Career: విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ సెంచరీలు, రికార్డులు ఇవే

Virat Kohli Test Career: భారత టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ బ్యాటర్, మాజీ టీమ్ ఇండియా రథ సారధి విరాట్ కోహ్లి వైట్ అండ్ వైట్ ఫార్మట్‌కు రిటైర్మంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డుల గురించి పరిశీలిద్దాం.


IPL Reschedule: హైదరాబాద్‌, చెన్నైకి భారీ షాక్‌.. ఐపీఎల్‌ 2025 రీషెడ్యూల్‌ విడుదల

BCCI Big Shock To Hyderabad Chennai: భారత్‌, పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల రీషెడ్యూల్‌ వచ్చేసింది. యుద్ధానికి తాత్కాలిక విరామం లభించడంతో లీగ్‌ను పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.


IPL ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా!

పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ ప్యానెల్ సభ్యులు నిన్న రాత్రి సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయాన్నే బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తాము సమర్థిస్తామని, పరిస్థితులకు తగ్గట్టుగానే వెళ్తామంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా స్పష్టం చేశారు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ నాయకత్వంలోని బృందం కీలక భేటీ నిర్వహించి కొద్ది రోజుల పాటు ఐపీఎల్ 2025ను నిలిపివేయాలని నిర్ణయించారు.


IPL 2025 మళ్లీ అప్పుడే.. రీ షెడ్యూల్ అప్‌డేట్ ఇదిగో..?

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్స్ నిర్వహించాల్సి ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో భారత్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌‌కు వెళ్లాలి. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చే అవకాశం లేకపోవడంతో.. ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్‌లు ఈ టెస్టు సిరీస్ తర్వాతే జరగాలి. ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ పూర్తయ్యాకే అంటే ఇక ఆగస్టులో అనే అర్థం...


పాపం RCB.. కప్ గెలుద్దామంటే.. అప్పుడు కరోనా.. ఇప్పుడు యుద్ధం.. ఇదేం జాతకం బాబోయ్..!

శుక్ర మహాదశలోనూ శనిగాడు ఎంటర్ అవడం అంటే ఇదేనేమో. ఆర్సీబీ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తుంది. ఐపీఎల్ 2025లో దూసుకుపోతున్న సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుని ఏకంగా వారం రోజుల పాటు ఈ సీజన్ వాయిదా పడింది. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులు బాగుంటే ఐపీఎల్ 2025 గురించి ఆలోచిస్తామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.


Virat Kohli's Retirement: మరో వికెట్ అవుట్.. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్

Virat Kohli's Retirement: టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. 14ఏళ్ల పాటు భారత్ తరపున టెస్ట్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. కెరీర్ లో 123 టెస్టు మ్యాచులను ఆడిన విరాట్ కోహ్లీ 9,230 పరుగులు సాధించాడు.


ఫ్యాన్స్ క్రేజీ ఐడియా.. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ కోసం భారీ సర్‌ప్రైజ్!

టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ మే 17న తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడనున్నాడు. అయితే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీకి గ్రాండ్‌గా వీడ్కోలు ఇవ్వాలని ఆర్సీబీ ప్లాన్స్ భావిస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వైట్‌ జెర్సీ ధరించి రావాలని పిలుపునిస్తున్నారు.


రోహిత్ శర్మ ఫుల్ టైమ్ రిటైర్మెంట్ అప్పుడే.. హిట్‌మ్యాన్ లక్ష్యం అదే: చిన్ననాటి కోచ్

"అతని లక్ష్యం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027ను గెలవడమే, ఆ తర్వాతే రిటైర్మెంట్. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కూడా గెలవాలి అనుకున్నాడు.. దురదృష్టవశాత్తు క్వాలిఫై కాలేకపోయింది. ఇప్పుడు అతని ముందుంది 2027 వన్డే వరల్డ్ కప్. నేను కూడా వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే అతను రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ సిద్ధేశ్ లాడ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.


WTC Finalకి ఆస్ట్రేలియా స్క్వాడ్ ఇదే.. కామెరూన్ గ్రీన్‌కి గోల్డెన్ ఛాన్స్!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆసీస్ వరల్డ్ క్లాస్ పేసర్లు ముగ్గురూ కూడా అందుబాటులో ఉండటం ఆ జట్టు ప్లస్‌గా మారింది. ఎంతో కాలంగా జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్న కామెరూన్ గ్రీన్‌కు చక్కటి అవకాశం దొరికింది. ఈ స్క్వాడ్‌లో ఆస్ట్రేలియా జట్టు ముగ్గురు యువకులకు అవకాశం కల్పించింది. జూన్ 11న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా జట్టుతో ఆసీస్ ఫైనల్‌లో తలపడనుంది.


Shubman Gill: కప్పు ముఖ్యం బిగిలూ.. అందరికంటే ముందే ట్రైనింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్‌

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరగడంతో ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయింది. మరో 4-5 రోజుల్లో టోర్నీ మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో బీసీసీఐ.. ఇప్పటికే అన్ని జట్లకు ఈ విషయంపై సమాచారం అందించింది. ఆటగాళ్లను రప్పించాలని స్పష్టం చేసింది. అయితే అన్ని జట్ల కంటే ముందే గుజరాత్ టైటాన్స్.. ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించింది.


బీసీసీఐ త్వరలో కీలక ప్రెస్ కాన్ఫరెన్స్.. అదే రోజు టీమిండియా టెస్టు కెప్టెన్ ప్రకటన!

రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్, కోహ్లి రిటైర్మెంట్ ప్రకటనతో పాటు టీమిండియా నూతన టెస్టు కెప్టెన్‌పై క్లారిటీ ఇచ్చేందుకు బీసీసీఐ త్వరలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చూస్తోంది. ఆ మీడియా కాన్ఫరెన్స్‌లోనే టీమిండియా నూతన కెప్టెన్ ప్రకటించాలని చూస్తోంది. యువ ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్‌ను మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లే ఇండియా ఏ జట్టు...


Test Cricket: ఆ ముగ్గురి రిటైర్‌మెంట్‌కు గంభీరే కారణమా? కోచ్‌గారి రాజకీయాలు పెరిగిపోయాయా?

Virat Kohli's Retirement: టెస్ట్ క్రికెట్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు అశ్విన్, రోహిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు దిగ్గజాలు భారత్ కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే రిటైర్మెంట్ ప్రకటించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అశ్విన్, రోహిత్..ఇప్పుడు విరాట్ కూడా గంభీర్ వల్లే రిటైర్డ్ అయ్యారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.


IPL 2025 ప్లే ఆఫ్స్.. ఫైనల్స్ జరిగేది అక్కడే? హైదరాబాద్‌కి నో ఛాన్స్!

ఐపీఎల్ 2025 అప్‌డేటెడ్ షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో ప్లే ఆఫ్స్ హైదరాబాద్ వేదికగా జరగాల్సి ఉండగా.. కొత్తగా వెల్లడించిన షెడ్యూల్‌లో కనీసం ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా లేదు. దేశంలోని కేవలం ఆరు స్టేడియాలనే ఈ మ్యాచ్‌లకు వేదికగా ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కోసం ముంబై, ఫైనల్స్‌కు అహ్మదాబాద్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇంగ్లండ్‌లో ఐదు సెంచరీలు చేస్తానన్న కోహ్లి.. కానీ ఇంతలోనే రిటైర్మెంట్! ఢిల్లీ రంజీ కోచ్ ఏం చెప్పాడంటే..?

టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించే కొన్ని వారాల ముందే ఢిల్లీ రంజీ కోచ్ శరణ్‌దీప్ సింగ్‌తో మాట్లాడాడు. ఆ రోజు కోహ్లి చెప్పిన మాటలకు.. ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయానికి అస్సలు పొంతన కుదరడం లేదు. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తీసుకోవడానికి ఏదో బలమైన కారణమే పని చేసి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కోహ్లి రిటైర్మెంట్‌ ఇవ్వకుండా ఉండటానికి బీసీసీఐతో పాటు టీమిండియా మాజీ లెజెండ్స్ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు.. కానీ కుదరలేదు.


టీమిండియా నూతన కెప్టెన్‌గా గిల్.. వైస్ కెప్టెన్‌గా ఆ టెర్రిబుల్ ఆటగాడే!

టీమిండియా టెస్టు సెలక్షన్ కోసం బీసీసీఐ చాలా కసరత్తులు చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా నూతన కెప్టెన్‌తో పాటు నూతన జట్టును కూడా బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించనుంది. టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రాని సారథిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ.. గాయాల బెడద వెంటాడుతుండటంతో...


ఆర్సీబీకి హాయ్ చెబుతున్న దరిద్రం..! కీలక ప్లేయర్ గాయంతో ఔట్‌!

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 మే 15 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే జరిగితే ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో ప్లేసులో ఉన్న ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ఆ జట్టు స్టార్ పేసర్ హేజిల్‌వుడ్‌ గాయంతో బాధపడుతున్నాడు. టోర్నీ వాయిదా పడ్డ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిన అతడు.. మే నెలలో టోర్నీ జరిగితే లీగ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి!


క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఐపీఎల్ పునఃప్రారంభం అప్పుడే! ఫైనల్ ఆరోజే..!

భారత్‌-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వారం పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 మే 15న పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి ఆటగాళ్లందరినీ జట్టు శిబిరంలోకి రప్పించాలని బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకు చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే మే 30న ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది!