దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ (టీ20)కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకూ జరగాల్సి ఉన్న ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా డిఫెండింగ్ చాంపియన్ భారత్.. యూఏఈ, నేపాల్, పాకిస్థాన్లతో కలిసి గ్రూప్-ఏ లో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్ గ్రూప్-బీలో ఉన్నాయి. జూలై 19 నుంచి 21 దాకా లీగ్ దశ మ్యాచ్లు ఉండగా 26న సెమీస్, 28న ఫైనల్ నిర్వహించనున్నట్టు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
2024-03-26T22:48:09Z dg43tfdfdgfd