ధోనీ ఇలా ర్యాగింగ్ కూడా చేస్తాడా.. చూస్తే నవ్వాగదు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అదరగొడుతున్నాడు. మ్యాచు చివర్లో బ్యాటింగ్‌కు వస్తూ ధనాధన్ సిక్సర్లతో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాడు. తనదైన శైలిలో కీపింగ్ చేస్తూ.. వ్యూహాలను అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన చివరి మ్యాచులో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీ చేసిన పని ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

ముంబైతో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206/4 పరుగులు చేసింది. ఈ మ్యాచులో నాలుగు బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చిన ధోనీ.. హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. ఓ దశలో పోటీ ఇచ్చింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగాడు. ఫీల్డింగ్‌లో మార్పులు చేర్పులు చేస్తూ కనిపించాడు.

అయితే సీఎస్కేలోని ఒక ఫీల్డర్ మాత్రం.. ధోనీ సూచనలను పట్టించుకోలేదు. అంతేకాదు ఫీల్డింగ్‌లో తన పొజిషన్‌ నుంచి అటూ ఇటూ కదులుతూ కనిపించాడు. ఇది గమనించిన ధోనీ.. తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. "అరే భాయ్.. ఎటు వెళ్తున్నావ్.. కుదురుగా ఒక్కచోట ఉండు కదా" అన్నట్లు సైగలు చేశాడు. సదరు ఫీల్డర్‌ చేసినట్లుగా అటూ ఇటూ కదిలాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దటీజ్ ధోనీ.. ధోనీ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్‌టైన్మెంట్ ఉన్నట్లే అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ 186/6 పరుగులకు పరిమితమైంది. 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన చెన్నై.. నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సీఎస్కే తన తర్వాతి మ్యాచులో ఈనెల 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-17T16:47:20Z dg43tfdfdgfd