ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు.. హిస్టరీ క్రియేట్ చేసిన పంజాబ్ కింగ్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పరుగుల వరద కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో బౌలర్లపై బ్యాటర్లు దండయాత్ర చేస్తున్నారు. దీంతో రికార్డుల మోత మోగుతోంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులోనూ అదే జరిగింది. ఈ మ్యాచులో రెండు జట్లూ కూడా 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేశాయి. సిక్సర్ల పరంగా కూడా ఈ మ్యాచులో కొత్త రికార్డులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ మ్యాచులో నమోదైన రికార్డుల వివరాలు ఈ కథనంలో చూద్దాం..

టీ20 రన్ ఛేజ్‌లో అత్యధిక స్కోర్లు..

శుక్రవారం జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ జట్టు 262/2 నమోదు చేసింది. ఇదే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం 262/7 స్కోరు నమోదు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం గెలుపొందింది. ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ జాబితాలో సౌతాఫ్రికా మూడో ప్లేసులో ఉంది. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా 259/4 స్కోరు నమోదు చేసింది.

ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు..

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ 24 సిక్స్‌లు నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 22 సిక్సర్ల చొప్పున కొట్టింది. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నేపాల్ నిలిచింది. మంగోలియా టీమ్‌పై నేపాల్ 26 సిక్సర్లు కొట్టింది.

టీ20 మ్యాచులో అత్యధిక సిక్సర్లు..

కేకేఆర్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచులో మొత్తం 42 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇదే ఐపీఎల్‌లో మరో రెండు మ్యాచుల్లోనూ 38 చొప్పున సిక్సర్లు నమోదు అయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్, ఆర్సీబీ-సన్ రైజర్స్ మ్యాచులో 38 సిక్సర్ల చొప్పున కొట్టారు.

ఐపీఎల్‌ మ్యాచులో నమోదైన అత్యధిక స్కోరు..

ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచులో మొత్తంగా 549 పరుగులు నమోదయ్యాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్, కేకేఆర్-పీబీకేఎస్ మ్యాచులో 523 రన్స్ చొప్పున నమోదు అయ్యాయి.

ఐపీఎల్‌లో విజయవంతమైన రన్ ఛేజ్..

కేకేఆర్‌తో మ్యాచులో పంజాబ్ కింగ్స్ 262 పరుగులు ఛేజ్ చేసింది. ఐపీఎల్‌లోనే కాకుండా ఓవరాల్ టీ20 క్రికెట్‌లో ఇదే విజయవంతమైన ఛేజ్. ఐపీఎల్‌లో తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 2020లో పంజాబ్‌తో మ్యాచులో 224 పరుగులు ఛేజ్ చేసింది. 2023లో వెస్టిండీస్‌తో మ్యాచులో దక్షిణాఫ్రికా 259 పరుగులు ఛేజ్ చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T02:57:00Z dg43tfdfdgfd