డల్లాస్: టీ20 వరల్డ్కప్(T20 Worldcup)లో భాగంగా గ్రూప్ డీలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్లో రెండు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. డల్లాస్లో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 124 రన్స్ మాత్రమే చేసింది. లంక బ్యాటర్లలో నిషాంకా 47, ధనంజయ్ 21 రన్స్ చేశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అతికష్టం మీద మ్యాచ్ను నెగ్గింది. మరో ఆరు బంతులు మిగిలి ఉండగా టార్గెట్ను అందుకున్నది. లింటన్ దాస్ 36, తౌహిద్ హృదయ్ 40 రన్స్ చేశారు. ఆ ఇద్దరూ 4 వికెట్లకు 63 రన్స్ జోడించారు. లంక బౌలర్లలో తుషారా 4 వికెట్లు తీసుకున్నాడు.