ఓ పక్క ఐపీఎల్ 2024 జరుగుతుండగానే.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన సందడి మొదలైంది. చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సైతం 15 మందితో కూడిన ప్రధాన జట్టు.. నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ప్రపంచకప్ 2023ని కొద్దిలో మిస్ చేసుకున్న భారత్.. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసమే సీనియర్లు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఓ సూచన చేశాడు. అందుకు గల కారణాలను సైతం వెల్లడించాడు.
"టీమ్లో గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించడంలో తప్పులేదు. కానీ వారితో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఉన్నందున సరైన ప్రణాళికతో సిద్ధమవ్వాలి. ఇదే నేను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఇచ్చే సూచన. విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ప్రస్తుతం ఉన్న టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. రింకూ సింగ్కు జట్టులో చోటు దక్కకపోవడం అతడి దురదృష్టం. అయినా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన రోహిత్ సారథ్యంలో భారత జట్టుకు ట్రోఫీని గెలిచే సత్తా ఉంది. నా వరకు మాత్రం.. ఈ టోర్నీ ఫైనల్లో భారత్-వెస్టిండీస్ తలపడాలని కోరుకుంటున్నా" అని బ్రియాన్ లారా తన మనసులోని మాటను చెప్పాడు.
కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో జూన్ 1న టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. భారత్ తన తొలి మ్యాచులో జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. జూన్ 9న పాకిస్థాన్ను ఢీకొట్టనుంది.
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-08T08:55:25Z dg43tfdfdgfd