SATYA NADELLA: ఇండియ‌న్ జెర్సీలో స‌త్యా నాదెళ్ల‌.. ఇండోపాక్ మ్యాచ్ వీక్షించిన మైక్రోసాఫ్ట్ సీఈవో

న్యూయార్క్‌: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండోపాక్ మ్యాచ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్యా నాదెళ్ల(Satya Nadella) ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో ఇండియా అద్భుత విజయాన్ని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ప్రేక్ష‌కుల గ్యాల‌రీలో ఉన్న స‌త్యా నాదెళ్ల .. వ్యాపార‌వేత్త గౌర‌వ్ జెయిన్‌తో సెల్ఫీ దిగారు. ఇండియ‌న్ జెర్సీ ధ‌రించిన నాదెళ్ల‌.. మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. క్రికెట్ అభిమానుల‌తో క‌లిసి స‌త్యా నాదెళ్ల దిగిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే స‌త్య నాదెళ్ల‌కు చెందిన ఫోటోకు ఎక్స్ లో ల‌క్ష‌ల వ్యూవ్స్ వ‌చ్చాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా అతి క‌ష్టం మీద 119 ర‌న్స్ చేసింది. అయితే 120 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ జ‌ట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా మూడు, పాండ్యా రెండేసి వికెట్లు తీసుకున్నారు. క్రికెట్ ప‌ట్ల త‌న‌కు ఉన్న ఇష్టాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్యా నాదెళ్ల చెప్పాడు. టీమ్ వ‌ర్క్‌, లీడ‌ర్‌షిప్ వంటి వాటిని క్రీడ‌ల నుంచే నేర్చుకున్న‌ట్లు తెలిపాడు. క్రికెట్ ఆడ‌డం వ‌ల్ల టీమ్‌ల‌తో వ‌ర్క్ చేయ‌డం నేర్చుకున్న‌ట్లు గుర్తు చేశాడు.

2024-06-10T06:21:46Z dg43tfdfdgfd