ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. హోం గ్రౌండ్లో టైటాన్స్ను 89 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీ.. 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని అందుకుంది. 11.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించిన ఢిల్లీ నెట్ రన్రేట్ను సైతం గణనీయంగా మెరుగుపర్చుకుంది. బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం.
గుజరాత్పై గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి ఒకేసారి ఆరో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ మూడింట్లో గెలిచి, నాలుగింట్లో ఓడింది. ఢిల్లీతోపాటు లక్నో, గుజరాత్ జట్ల ఖాతాలోనూ ఆరు చొప్పున పాయింట్లు ఉన్నాయి. అయితే లక్నో ఆరు మ్యాచ్లే ఆడటంతోపాటు.. ఆ జట్టు నెట్ రన్ రేట్ (+0.038) కూడా ఢిల్లీ (-0.074) కంటే మెరుగ్గా ఉంది.
టైటాన్స్పై 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం నెట్ రన్ రేట్ పరంగా ఢిల్లీకి కలిసొచ్చింది. -1.303 నెట్ రన్ రేట్ ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఢిల్లీపై గుజరాత్ గెలిచి ఉండుంటే.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకునేది. కానీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది.
ముందే చెప్పుకున్నట్టు లక్నో, ఢిల్లీ, గుజరాత్ వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. రెండేసి మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 8, 9 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇవాళ (ఏప్రిల్ 18న) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆరు లేదా ఏడో స్థానానికి చేరుకోవచ్చు. ఏడు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లోనే గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-04-18T04:47:44Z dg43tfdfdgfd