IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్ల మెరుపులే కాదు స్లో ఓవర్ రేటు ఫైన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు కెప్టెన్లు జరిమానా బారిన పడగా.. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు భారీ ఫైన్ పడింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేటు కారణంగా రిఫరీలు హార్దిక్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
పదిహేడో సీజన్లో బోణీ కోసం నాలుగు మ్యాచ్లు ఎదురుచూసిన ముంబై.. మళ్లీ గెలుపు బాట పట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జయభేరి మోగించిన పాండ్యా సేన.. పంజాబ్ కింగ్స్పై గెలిచి మూడో విజయం నమోదు చేసింది.
ముల్లన్పూర్ స్టేడియంలో తొలుత ముంబై 192 రన్స్ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్(78) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా(3/21) విజృంభణతో పంజాబ్పై సూపర్ విక్టరీ కొట్టిది. అశుతోష్ శర్మ(61) ముచ్చెమటలు పట్టించినా.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో ముంబై 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 22న రాజస్థాన్ రాయల్స్తో ముంబై తలపడనుంది.