Dinesh Karthik : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కామెంటేటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) ఫినిషర్గా చెలరేగిపోతున్నాడు. కష్ట సమయాల్లో ‘నేనున్నంటూ’ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)కు కొండంత భరోసానిస్తున్నాడు. అతడి జోరు చూస్తుంటూ టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) జట్టులోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. కార్తీక్ సైతం వరల్డ్ కప్లో ఆడడంపై తన మనసులోని మాటను వెల్లడించాడు. టీమిండియాకు మళ్లీ ఆడేందుకు తాను వంద శాతం సిద్దంగా ఉన్నానని ఆర్సీబీ స్టార్ తెలిపాడు.
‘నా జీవితంలో ఇప్పుడు టీమిండియాకు మళ్లీ ప్రాతినిధ్యం వహిస్తే నిజంగా అది చాలా గొప్ప ఫీలింగ్. అందుకు నేను వంద శాతం సిద్దంగా ఉన్నా. వరల్డ్ కప్ విమానం ఎక్కేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మెగా టోర్నీకి పటిష్టమన భారత జట్టును ఎంపిక చేసేవాళ్లలో నిజాయతీగల వ్యక్తులు ఉన్నారనే విషయం నాకు తెలుసు’ అని కార్తిక్ వెల్లడించాడు.
రెండేండ్ల క్రితం కూడా కార్తిక్ మెరుపు బ్యాటింగ్తో 2022లో పొట్టి ప్రపంచ కప్ స్క్వాడ్కు ఎంపికయ్యాడు. అయితే.. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ఆ మెగాటోర్నీలో ఫినిషర్గా కార్తిక్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో, అజిత్ అగార్కర్(Ajith Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మళ్లీ కార్తిక్పై నమ్మకం ఉంచుతుందా? లేదా? అనే ప్రశ్నకు త్వరలోనే తెరపడనుంది. ఐదిహేడో సీజన్ ఐపీఎల్లో కార్తిక్ ఓ రేంజ్లో ఆడుతున్నాడు.
పంజాబ్పై 23 నాటౌట్లో ఆర్సీబీని గెలిపించడమేకాదు.. హైదరాబాద్పై 35 బంతుల్లోనే 83 రన్స్తో చెలరేగాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్లో కార్తిక్ 226 రన్స్ కొట్టి ఫినిషర్గా తాను వరల్డ్ కప్ రేసులో ఉన్నానని సంకేతాలు ఇస్తున్నాడు. అయితే.. ఐపీఎల్లో కుమ్మేస్తున్న కుర్రాళ్లు శివం దూబే, రింకూ సింగ్, రియాన్ పరాగ్లు ఫినిషర్గా స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీళ్లను కాదని కార్తిక్కు చాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరం.