టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా టోర్నీలో సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ప్రతీ పరుగు కీలమైందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా.. అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అంపైర్ నిర్ణయం, డెడ్ బాల్ రూల్ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే డెడ్ బాల్ రూల్ కారణంగా ఆ జట్టు 4 పరుగులు కోల్పోయింది. ఇదే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది.
రివ్యూలో నాటౌట్ అని తేలింది. అయితే బంతి బౌండరీ లైన్ను దాటడంతో ఫోర్ ఇవ్వాలి కదా అనే ప్రశ్న తలెత్తింది. కానీ డెడ్బాల్ రూల్ ప్రకారం అలా ఇవ్వడం కుదరదని అంపైర్లు తేల్చేశారు. ఫలితంగా మహ్మదుల్లా తన వికెట్ కాపాడుకున్నా.. ఆ పోయిన పరుగులు మాత్రం సంపాదించలేకపోయాడు.
ఈ నిబంధనను భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వసీం జాఫర్లు తప్పుబట్టారు. ప్రత్యర్థికి కీలకమైన పరుగులు ఇవ్వకుండా చేయడానికి ఈ నిబంధనను ఒక టీమ్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వసీం జాఫర్ కూడా ఈ నిబంధనను తప్పుబడుతూ.. బంగ్లాదేశ్ టీమ్, అభిమానులకు తన సానుభూతి తెలిపాడు.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 రన్స్ చేసింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసి నాలుగు పరుగులతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ 2024లో వరుసగా మూడు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా టోర్నీలో సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-06-11T05:46:06Z dg43tfdfdgfd