టీ20 ప్రపంచకప్ 2024లో ఫైనల్ చేరే జట్లలో చాలా మంది విశ్లేషకులు పాకిస్థాన్ పేరును చెప్పారు. పేపర్పై ఆ జట్టు బలంగా ఉందని.. టోర్నీలోనూ రాణిస్తుందని విశ్లేషించారు. గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్థాన్ కూడా సూపర్-8కు చేరుతుందని అంచనా వేశారు. కానీ ఇదంతా టోర్నీ ప్రారంభానికి ముందు మాట. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. సెమీఫైనల్ సరికదా.. ఆ జట్టు కనీసం సూపర్-8 ఐనా చేరుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన పాక్.. సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. దాదాపుగా సూపర్-8 చేరినట్లే..!
ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు.. అమెరికాతో తలపడింది. ఆ జట్టు గొప్పగా పోరాడటంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసిన ఆతిథ్య యూఎస్ఏ పాక్కు షాక్ ఇచ్చింది. తాజాగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచులోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఓ దశలో ఈజీగా గెలిచేలా కన్పించినా.. అనూహ్యంగా 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా పాకిస్థాన్ సూపర్-8లో క్వాలిఫై అయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పుడు ఆ జట్టు తదుపరి దశకు అర్హత సాధించాలంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. సూపర్-8 చేరినట్లే. మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లో గెలిచినా.. టీమిండియా ముందంజ వేస్తుంది. భారత్ తన తర్వాతి మ్యాచుల్లో యూఎస్ఏ, కెనడాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో భారత్ గెలవడం ఖాయం! గ్రూప్-ఏలో భారత్తో పాటు సూపర్-8కు చేరే మరో జట్టేదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-06-10T16:14:00Z