టీమిండియా టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. 1971లో సునీల్ గవాస్కర్ క్రియేట్ చేసిన ఈ రికార్డును శుభమన్ గిల్ 54 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్లో శతకం బాదాడు.
ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒకే టెస్టులో 350 పరుగులు చేసిన ఆటగాడు శుభమన్ గిల్ ఒక్కడే.
టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 344 పరుగులు చేశాడు. ఈ యాభై ఏళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా ఆటగాడు లేనే లేడు. వీవీఎస్ లక్ష్మణ్ గవాస్కర్ దగ్గరకు వచ్చిన 344 పరుగులకు పైగా చేయలేకపోయాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వీవీఎస్ 340 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 2007లో పాకిస్తాన్పై 330 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ - ఇండియా ఐదు టెస్టుల సిరీస్లో రెండో టెస్టుకే శుభమన్ గిల్ 500కు పైగా పరుగులు సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్గా ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన గిల్.. టీమిండియా బ్యాటర్లలో ఇంగ్లండ్పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఇక రెండో టెస్టులో 500కు పైగా పరుగులు చేస్తే.. మిగతా మూడు టెస్టుల్లో ఇంకెన్ని పరుగులు చేస్తాడోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2025-07-05T15:07:49Z