ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఇంట్రెస్ట్గా మారుతోంది. డూ ఆర్ డై మ్యాచ్లకు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. అయితే ఈ వర్షాలు ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి ఫేవర్గా మారాయి. మొన్నటికి మొన్న ఉప్పల్లో సన్రైజర్స్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీని వరుణుడు కాపాడాడు. దాంతో ఇరు జట్లకి చెరొక పాయింట్ దక్కడంతో ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోగా.. సన్రైజర్స్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు కూడా ధర్మశాల వేదికగా పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్లో వర్షం పెద్ద సమస్యగా మారింది. ధర్మశాల వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆలస్యమయింది. రాత్రి 8 గంటల వరకు కూడా టాస్ పడలేదు. వర్షం ఇబ్బంది పెట్టడంతో అంపైర్లు టాస్ వేయడానికి మరింత ఆలస్యం చేస్తున్నారు. వర్షం తగ్గినప్పటికీ అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగి ఆ తర్వాత వర్షం పడినప్పటికీ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్కే ఎక్కువ లాభం ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్లో అడుగుపెట్టే తొలి జట్టుగా నిలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకి చెరొక పాయింట్ దక్కనుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానంలోనే ఉండగా, పంజాబ్ 16 మూడో స్థానంలోనే ఉంటుంది.