LUCKNOW T20I: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. భారత జట్టులో ఒక మార్పు

లక్నో వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నామని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. ఈ పిచ్ మీద గత రికార్డులను బట్టి చూస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిందని శాంట్నర్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆడిస్తున్నట్లు తెలిపాడు. దేశంలోని పెద్ద గ్రౌండ్లలో లక్నో స్టేడియం ఒకటి. పిచ్ పొడిగా ఉండటంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే ఉద్దేశంతో అదనపు స్పిన్నర్‌‌ను టీమిండియా తుది జట్టులోకి తీసుకుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో.. 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయగలిగేలా జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు.

రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌లో నిలవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.

భారత జట్టు:

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు:

ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రాస్‌వెల్, జాకబ్ డఫే, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యుసన్, బ్లెయిర్ టిక్నర్.

2023-01-29T13:25:50Z dg43tfdfdgfd