IPL POINTS TABLE: లక్నో అధోగతి.. పంజాబ్ అలాపైకి! రెడ్కార్పెట్తో రాయల్గా ఆర్సీబీ!!
![]()
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ దగ్గరపడుతున్న కొద్ది మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నీ డూ ఆర్ డై మ్యాచ్లే కావడంతో ఆఖరి వరకూ ప్రతి జట్టూ పోరాటం చేస్తూనే ఉంది. ఆర్సీబీ - సీఎస్కే మ్యాచ్ మరువకముందే కేకేఆర్ - రాజస్థాన్ మధ్య లాస్ట్ బాల్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో చేతులెత్తేసి పాయింట్ల పట్టికలో చతికిలపడింది. ఈ సీజన్లో ఫస్ట్ నుంచి అదరగొడుతున్న ఆర్సీబీ రెడ్ కార్పెట్ వేసుకుని మరీ టాప్ ప్లేస్లో రాయల్గా కూర్చుంది.
టాప్లో ఆర్సీబీ, పంజాబ్
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 11 మ్యాచ్లు ఆడి ఎనిమిది గెలిచి 16 పాయింట్లు సాధించింది. రన్రేట్లో కూడా 0.482తో ఉంది. ఆర్సీబీ తర్వాత స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సేన పంజాబ్ కింగ్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ ఏడు గెలిచి, మూడు ఓడింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ దక్కగా మొత్తం 15 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది.
దూసుకుపోతున్న ముంబై ఎక్స్ప్రెస్
ఈ సీజన్లో మొదటి ఐదు మ్యాచ్లలో ఒకే ఒక్కటి గెలిచిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఏడు విజయాలతో 1.274 రన్రేట్, 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ పది మ్యాచ్లలో ఏడు గెలిచి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఆశలతో ఆ మూడు
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నా.. కేకేఆర్, లక్నో మాత్రం అద్భుతం జరిగితే తప్పితే ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ పది మ్యాచ్లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, కోల్కతా 11 ఆడి 5 గెలిచి ఆరులో, లక్నో 11 ఆడి ఐదు గెలిచి ఏడో స్థానంలో నిలిచాయి.
ఎలిమినేషన్ జోన్లో
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. సన్రైజర్స్ కూడా ఈ రోజో రేపే బెర్త్ కన్ఫార్మ్ చేసుకోనుంది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్లలో మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉండగా, సన్రైజర్స్ 10 మ్యాచ్లలో మూడు గెలిచి తొమ్మిదిలో కొనసాగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో ఉంది.
2025-05-05T03:54:07Z