IPL 2023 FINAL ముంగిట చెన్నై టీమ్‌ని కలిసిన సురేశ్ రైనా

ఐపీఎల్ 2023 సీజన్ ఈరోజు ఫైనల్‌తో ముగియబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటిల్స్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కి కామెంటేటర్‌ వ్యవహరించబోతున్న సురేశ్ రైనా.. స్టేడియంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లని కలిసి కాసేపు మాట్లాడాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి రిటైర్మెంట్ వరకు చెన్నై టీమ్‌కే రైనా ఆడిన విషయం తెలిసిందే. మధ్యలో రెండేళ్ల పాటు చెన్నై టీమ్‌పై నిషేధం పడటంతో గుజరాత్ లయన్స్ జట్టుకి రైనా ఆడాడు.

ఐపీఎల్ 2023 ఫైనల్ ముంగిట చెన్నై టీమ్‌లోని పాత సహచరులతో కాసేపు ముచ్చటించిన రైనా.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతోనూ జోక్‌లు వేస్తూ కనిపించాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సురేశ్ రైనా రాకని నమ్మలేనట్లు కళ్లు తుడుచుకుని మరీ చూస్తూ దీపక్ చాహర్ ఆట పట్టించాడు. కానీ ఆ టైమ్‌లో ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో లేడు. దాంతో ఇద్దరూ కలవలేకపోయారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఇందులో చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. కానీ.. ఓవరాల్‌గా గెలుపోటముల రికార్డ్‌లో మాత్రం గుజరాత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఛేదనలో రెండు జట్లకీ మెరుగైన రికార్డ్‌ ఉండటంతో.. ఫైనల్లో టాస్ కీలకంకానుంది.

2023-05-28T11:46:56Z dg43tfdfdgfd