IND VS NZ: తొలి టీ20లో టాస్ గెలిచిన హార్దిక్.. రిస్క్ తీసుకొని కెప్టెన్.. భారత జట్టు ఇదే..

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం ఉండనుండటంతో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని పాండ్య తెలిపాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచ్‌లోనూ దాదాపుగా బరిలోకి దిగుతోంది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీ్ప్ చేసిన భారత్.. టీ20ల్లోనూ అదే ప్రదర్శన రిపీట్ చేయాలని ఆశిస్తోంది.

కేన్ విలియమ్సన్ భారత పర్యటనకు దూరంగా ఉండటంతో.. వన్డేల్లో టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్‌గా వ్యహరించగా.. టీ20ల్లో మిచెల్ శాంట్నర్ ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడనని శాంట్నర్ తెలిపాడు. లాథమ్, నికోల్స్ స్థానంలో చాప్‌మన్, టిమ్ సోధీని జట్టులోకి తీసుకున్నట్లు కివీస్ కెప్టెన్ తెలిపాడు.

భారత జట్టు:

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు:

ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రాస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యుసన్, బ్లెయిర్ టిక్నర్.

2023-01-27T13:24:43Z dg43tfdfdgfd