చావో రేవో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తడబడింది. ఆరంభంలో ఎక్కువ పరుగులు రాబట్టినా.. మిడిల్ ఓవర్లలో విఫలమైంది. ఆఖర్లో ఆండ్రీ రసెల్ రాణించడంతో గౌరవ ప్రధమమైన స్కోర్ చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ విఫలమైనప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్తో కలిసి కెప్టెన్ అజింక్య రహానే ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 58 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. రహ్మానుల్లా గుర్భాజ్ 9 బంతుల్లో 11 పరుగులు చేయగా, సునీల్ నరైన్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. అంగ్క్రిష్ రెండు బంతుల్లో ఒక్క పరుగు చేసి అలా వచ్చి ఇలా అవుటయ్యాడు.