ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. మెగా వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోకపోవడమే సీఎస్కే ఓటములకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదు అనిపించినా.. బ్యాటింగ్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలిమినేషన్ తర్వాత యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ 11లో చోటు కల్పించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. ఈ సీజన్లో సీఎస్కే మూడు విజయాలు సాధిస్తే.. ఆ మూడూ కూడా మూడు నెలల్లో సాధించింది. రుతురాజ్ కెప్టెన్సీలో ఒకటి, ధోనీ కెప్టెన్సీలో రెండు మ్యాచ్లలో సీఎస్కే విజయం సాధించింది. ఈ ఐపీఎల్లో ఎల్లో ఆర్మీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్లు మూడు నెలల్లో గెలవడం విశేషం. ఐపీఎల్ ప్రారంభ నెల మార్చ్లో ఒకటి, ఏప్రిల్లో ఇంకొకటి, ఐపీఎల్ ముగింపు మంత్ మేలో మరొక మ్యాచ్ గెలిచింది. ఈ సీజన్లో సీఎస్కే ఇంకో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఐపీఎల్ 2025లో సీఎస్కే తాను ఆడిన మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన చెన్నై ఆ తర్వాత వరుసగా ఐదు ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్పై రెండో విజయం సాధించిన చెన్నై.. నాలుగు మ్యాచ్లు ఓడి కేకేఆర్పై విజయాన్ని అందుకుంది. సీఎస్కే మిగతా రెండు మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఐపీఎల్ 2025 నుంచి మొట్టమొదట ఎలిమినేట్ అయిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం మూడు మాత్రమే గెలిచింది. తొమ్మిది మ్యాచ్లలో పరాజయం పాలయింది. బ్యాటింగ్ వైఫల్యంతోనే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లన్నీ ఓడిపోయింది. అయితే జట్టులోకి ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, డివాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్ రాకతో జట్టులో జోష్ పెరిగి భారీ పరుగులు రాబడుతోంది. మిగతా రెండు మ్యాచ్లలో కూడా రాణించి విజయాలతో సీజన్ను ముగించాలని సీఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2025-05-08T07:40:37Z