సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దుబే ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్మరన్ రవిచంద్రన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025కి దూరం కావడంతో అతని స్థానంలో విదర్భ ఆల్రౌండర్ హర్ష దుబేని సన్రైజర్స్ తీసుకుంది. ఈ సీజన్లో మిగతా మ్యాచ్లకు సన్రైజర్స్ స్క్వాడ్లో దుబే అందుబాటులో ఉండనున్నాడు. రూ.30 లక్షల ధరకు దుబేను రీప్లేస్ చేసుకున్నట్లు సన్రైజర్స్ ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిన దుబే ఇప్పుడు సన్రైజర్స్ స్క్వాడ్లో మెరవనున్నాడు. విదర్భ జట్టులో ఆల్రౌండర్గా హర్ష దుబే సత్తా చాటాడు. 16 టీ20లు, ఇరవై లిస్ట్ ఏ మ్యాచ్లు, 18 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడిన దుబే మొత్తం 127 వికెట్లతో పాటు 941 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ ఈ సారి కనీసం ప్లే ఆఫ్స్కు కూడా వెళ్లలేకపోయింది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు బ్యాటర్లను అలానే ఉంచుకుని కీ బౌలర్లను సన్రైజర్స్ మేనేజ్మెంట్ బయటకు వదిలేసింది. మెగా వేలంలో షమీని దక్కించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ షమీ విఫలమై భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది ఫుల్ ఫామ్లో ఉన్న బ్యాటర్లు ఈసారి కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ట్రావిస్ హెడ్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ కూడా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రెండు గెలవగా, మరొకటి చెపాక్లో చెన్నైపై గెలిచింది. ఉప్పల్లో గెలిచిన రెండు మ్యాచ్లలోనూ 200కు పైగా పరుగులు చేయడం విశేషం. తొలి మ్యాచ్లో 286 పరుగులు చేయడంతో ఈసారి 300 పక్కా అనుకున్నారు. కానీ దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకుంది.
2025-05-05T06:39:11Z