రిటైర్మెంట్ విషయంలో ధోనీని కాపీ కొట్టిన హిట్‌మ్యాన్..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు షాక్ చేశాడు. గత కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న హిట్‌మ్యాన్.. ఆ పార్మాట్‌ మొత్తానికి గుడ్‌బై చెప్పాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతునానని ప్రకటించాడు. అయితే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌కు.. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌కు కొన్ని పోలికలు ఉన్నాయి. వీరిద్దరూ అనుకోకుండానే కొన్ని విషయాల్లో ఒకరినొకరు ఫాలో అయ్యారు.

ఒకే టైమ్‌లో..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ 2020 ఆగస్టు 15 రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కూడా 2025 మే 7 రాత్రి 7.29 గంటలకు తన టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి.. రోహిత్ టెస్టు ఫార్మాట్‌కు ఒకే సమయంలో వీడ్కోలు పలికినట్లయింది.

ఒకే వేదికపై చివరి మ్యాచ్..

ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు స్వదేశంలో ఒకే వేదికపై చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. వీరిద్దరూ ముంబైలోని వాంఖడేలో ఈ మ్యాచ్ ఆడారు. అటు విదేశాల్లోనూ ఈ రికార్డు సమానంగా ఉంది. ఎందుకుంటే ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్ స్టేడియంలోనే తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడటం గమనార్హం.

రిటైర్మెంట్ తర్వాత కూడా కెప్టెన్సీ..

ధోనీ 2014లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఇతర ఫార్మాట్‌లలో మాత్రం జట్టుకు సారథిగా కొనసాగాడు. రోహిత్ శర్మ కూడా.. భారత వన్డే జట్టును నడిపించనున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా టెస్టులకు సైతం దూరమయ్యాడు. తన కెరీర్‌లో తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్న రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తున్నాడు! మరి రోహిత్ కల నెరవేరుతుందా? లేదా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పనుంది

2025-05-08T03:25:33Z