రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. ఫ్యాన్స్‌కు తెలీదంటూ..!

గత కొన్ని సీజన్‌లుగా ఐపీఎల్ ప్రారంభం అవుతుంటే చాలా మంది మదిలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. అదే.. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు? ఈ ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి ఈ ప్రశ్న వస్తోంది. ఐపీఎల్ 2025 మెగావేలం ఉన్నందన.. ఇక కచ్చితంగా రిటైర్మెంట్ చెప్పేస్తాడని.. గతేడాది వార్తలు వినిపించాయి. కానీ ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. ధోనీ ఐపీఎల్ 18వ ఎడిషన్‌లోకి అడుగుపెట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.ఇక తాజా ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే కెప్టెన్ మారినా ఆ జట్టు ఆటతీరు మాత్రం మారలేదు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్కే అవతరించింది. ఇక టోర్నీలో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. చెపాక్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్‌ కొట్టి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోనీ.. రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్‌కు సిద్ధమయ్యేందుకు చాలా సమయం ఉందని.. ఇప్పుడే నిర్ణయం చెప్పలేనని వ్యాఖ్యానించాడు. “నా క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటివరకు ఫ్యాన్స్‌ లవ్‌, ఆప్యాయతను పొందడం బాగుంది. కానీ నాకు ప్రస్తుతం 43 ఏళ్లు అనే విషయాన్ని మర్చిపోను. నా ఫ్యాన్స్‌లో చాలామందికి నాకు ఎప్పుడు చివరి సీజన్‌ అనే విషయం తెలియదు. అందుకే నా ఆటను చూసేందుకు స్టేడియాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నిజానికి నేను ఏడాదికి రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నా. వచ్చే ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉంది. రాబోయే 6-8 నెలలు ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తా. రిటైర్మెంట్‌ గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను” అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఈసారి జట్టుగా అనుకున్నమేర రాణించలేకపోయామని ధోనీ అంగీకరించాడు. మిగతా మ్యాచ్‌లలో అందరు ప్లేయర్లకు అవకాశాలు ఇస్తామని చెప్పాడు

2025-05-08T07:10:39Z