ఢిల్లీ: ప్రతిష్టాత్మక డేవిస్ కప్లో మొదటి రోజు భారత్ బోణీ కొట్టింది. వరల్డ్ గ్రనూప్ 1 ప్లేఆఫ్ టైలో భాగంగా శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లలో భారత్.. 2-0తో టోగోపై గెలిచింది. ఢిల్లీలో జరిగిన ఆరంభ మ్యాచ్లో శశికుమార్ ముకుంద్.. 6-2, 6-1తో లియోవ అజవొన్పై అలవోకగా గెలుపొందాడు.
రెండో సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్.. 6-0, 6-2తో థామస్ సెటొజిని చిత్తు చేశాడు.
2025-02-01T21:26:12Z