ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తొలి నాలుగు మ్యాచ్లు ఆడేశాక ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ సమష్టితత్వం లోపించి ఆ జట్టు వరుసగా ఓటములు మూటగట్టుకుంది. దీంతో ఈసారి కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తుందా ఏంటి? అనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ, ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీతో ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. దీంతో బుమ్రా రాకముందు.. బుమ్రా వచ్చాక అనేవిధంగా ముంబై జట్టు స్వరూపం మారిపోయింది.ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డాడు. దీంతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతడు బౌలింగ్కు కూడా దిగలేదు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా బుమ్రా దూరమయ్యాడు. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆలస్యంగా చేరాడు. ఆ జట్టు ఆడిన తొలి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా తిరిగి మైదానంలోకి దిగాడు. అయితే తన తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక బుమ్రా జట్టులోకి రాకముందు ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్లు ఆడింది. కానీ, అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి.. పాయింట్స్ టేబుల్లో వెనకబడి పోయింది. కానీ, బుమ్రా వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లోనూ ముంబై ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్లలోనూ జయభేరి మోగించింది. పాయింట్స్ టేబుల్లో పైపైకి దూసుకొచ్చింది. ప్లేఆఫ్స్కు చేరువైంది. ఈ ఎడిషన్లో బుమ్రా.. ఏడు మ్యాచ్లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా మ్యాచ్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలా ముంబై ఇండియన్స్ డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు బూమ్ బూమ్ బుమ్రా.