టీమిండియా యంగ్ బ్యాటర్, 23 ఏళ్ల యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. 21 ఏళ్లకే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. అనతికాలంలో నమ్మదగ్గ ప్లేయర్గా మారిపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్లో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఓపెనింగ్ ప్లేసును తనకు ఖరారు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ అతడు సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును సాధించాడు.
టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా జైశ్వాల్ నిలిచాడు. రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశ్వాల్ 40 టెస్టు ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్తో రెండో ఇన్నింగ్స్లో 22 బంతుల్లో 28 రన్స్ చేసిన ఈ ప్లేయర్.. ఈ జాబితాలో చేరిపోయాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్లోనే జైశ్వాల్ ఈ రికార్డు బ్రేక్ చేయాల్సింది. అతడు 87 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పుడే సెంచరీ చేసి ఉంటే.. టెస్టుల్లో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా జైశ్వాల్.. రికార్డులకు ఎక్కేవాడు.
తక్కువ ఇన్నింగ్స్లలో 2000 టెస్ట్ రన్స్ చేసిన భారత ప్లేయర్లు..
40 ఇన్నింగ్స్లు - రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైశ్వాల్
43 ఇన్నింగ్స్లు - వి.హజారే, గౌతమ్ గంభీర్
44 ఇన్నింగ్స్లు - సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్
45 ఇన్నింగ్స్లు - సౌరవ్ గంగూలీ
46 ఇన్నింగ్స్లు - చటెశ్వర్ పుజారా
ఇక ఇదే సమయంలో అతి చిన్న ఏజ్లో టెస్టుల్లో 2000 పరుగులు చేసిన రెండో బ్యాటర్గానూ జైశ్వాల్ రికార్డు సాధించాడు. అతడు 23 ఏళ్ల 188 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్.. 20 ఏళ్ల 330 రోజుల వయసులోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
2025-07-05T04:37:49Z