ఈడెన్‌లో బ్రెవిస్ బౌండరీల తుఫాన్.. ధనాధన్ సిక్సర్‌తో ధోనీ ఫినిషింగ్! కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి!!

ఈడెన్ గార్డెన్స్‌లో డివాల్డ్ బ్రెవిస్ బౌండరీ సునామీ సృష్టించాడు. చేయి దాటిపోయింది అనుకున్న మ్యాచ్‌లో వరుస బౌండరీలు బాది చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆశలు పుట్టించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీఎస్కే విజయంలో కీలకంగా మారాడు. లాస్ట్ ఓవర్‌లో ధోనీ తనదైన స్టయిల్‌లో సిక్సర్ బాది సీఎస్కే విజయాన్ని డిక్లేర్డ్ చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమిపాలయింది. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 179 పరుగులు చేయగా.. 180 పరుగుల ఈజీ టార్గెట్ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు దేవాన్ కాన్వే, ఆయుష్ మాత్రే డకౌట్లు అయ్యారు. ఇద్దరూ చెరి రెండు బంతులు ఆడి అవుటయ్యారు. డెబ్యూ ఆటగాడు ఉర్విల్ పటేల్ వరుస బౌండరీలతో విరుచుకుపడి కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 11 బంతుల్లోనే 31 పరుగులు బాదాడు. అయితే నితీష్ రాణా వేసిన అద్భుత బంతికి థర్డ్ మ్యాన్ వద్ద దొరికిపోయాడు. ట్రంప్ కార్డ్‌గా వచ్చిన అశ్విన్ 7 బంతుల్లో 8, రవీంద్ర జడేజా10 బంతుల్లో 19 పరుగులు చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి సీఎస్కే 62 పరుగలకు ఐదు వికెట్లు కోల్పోయింది. డివాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డివాల్డ్ బ్రెవిస్ ఆదుకున్నాడు. తనదైన షాట్లతో సీఎస్కే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌండరీ వద్ద దొరికిపోయాడు. దుబే నిలకడగా ఆడి..బ్రెవిస్ అవుటైన తర్వాత శివమ్ దుబే నిలకడగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి మ్యాచ్‌ని గెలిపించాడు. బ్రెవిస్ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా దుబే జాగ్రత్త పడ్డాడు. నిదానంగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదాడు. 40 బంతులు ఆడిన దుబే రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ 18 బంతుల్లో 17 పరుగులు చేయగా, అన్షుల్ కాంబోజ్ 1 బంతిలో నాలుగు పరుగులతో విన్నింగ్ షాట్ బాదాడు. 19.4 ఓవర్లలో సీఎస్కే 183 పరుగులతో విజయాన్ని సాధించింది.కేకేఆర్ జట్టులో వైభవ్ అరోరా మూడు ఓవర్లు వేసి భారీగా 48 పరుగులు సమర్పించుకుని మూడు వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకుని 43 పరుగులు ఇవ్వగా.. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. మొయిన్ అలీ రెండు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆండ్రీ రసెల్ 2.4 ఓవర్లలో 22 పరుగులు సమర్పించకున్నాడు.

2025-05-07T17:55:23Z