ఇప్పటివరకు ఐపీఎల్తో బిజీబిజీగా ఉన్న టీమిండియా ప్లేయర్స్లో ఇకపై టెస్టు ఫీవర్ మొదలవ్వనుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడనున్న తొలి టెస్టు సిరీస్ కూడా ఇదే. దాని కోసం నిన్న ముంబై నుంచి బయల్దేరిన టీమిండియా.. ఇవాళ లండన్ చేరుకుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 కూడా ఇంగ్లండ్ - ఇండియా సిరీస్తోనే ప్రారంభం కానుంది. దాంతో ఈ సిరీస్ను ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్కు బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా ఆలోచించి టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశాయి. ఈ సిరీస్ కోసం భారత్ ఏ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్కు వెళ్లగా.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో, గిల్ సారథ్యంలో కూడిన టీమిండియా సీనియర్ జట్టు ఈరోజు అడుగుపెట్టింది.
టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టెస్టు సిరీస్కు ముందు భారత్ ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికార మ్యాచ్లు ఆడనుండగా.. ఆ తర్వాత టీమిండియా, టీమిండియా ఏ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.