టీమిండియా టీ20 జట్టు కెప్టెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాట్తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కనీసం 25 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ స్కోరు చేస్తున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. మంగళవారం (మే 6) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ సత్తా చాటాడు సూర్యకుమార్. 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ను తిరిగి కైవసం చేసుకున్నాడు.ఐపీఎల్ 2025లో ఇప్పటివరకూ సూర్యకుమార్ యాదవ్ 12 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. అయితే, అన్నింట్లోనూ కనీసం 25 రన్స్ స్కోరు చేశాడు. వరుసగా 29 (26), 48 (28), 27 *(9), 67 (43), 28 (26), 40 (28), 26 (15), 68 *(30), 40* (19), 54 (28), 48* (23) & 35 (24) పరుగులు చేశాడు. దీంతో ఈ ఎడిషన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో అతడు కనీసం పాతిక రన్స్ స్కోరు చేసిన ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.అంతేకాకుండూ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ సూర్యకుమార్ అవతరించాడు. తాజా సీజన్తో పాటు.. 2018 (512 రన్స్), 2023 (605 రన్స్) సీజన్లోనూ 500 పైచిలుకు స్కోర్లు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ (2010, 2011), క్వింటన్ డికాక్ (2019, 2020) రెండుసార్లు ఈ ఫీట్ సాధించారు. ఈసారి ఐపీఎల్ (2025) టోర్నీలో ఆరెంజ్ క్యాప్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రధానంగా ఐదుగురు ఆటగాళ్ల మధ్య ఈ పోటీ ఉంది. ఒక్కోసారి కొన్ని గంటల వ్యవధిలోనే ఆరెంజ్ క్యాప్ మారుతోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో తన ఇన్నింగ్స్తో సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఆరెంజ్ క్యాప్ను తిరిగి దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు విరాట్ కోహ్లీ (505 రన్స్) వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. కోహ్లీ నుంచి సూర్యకుమార్ యాదవ్.. ఆరెంజ్ క్యాప్ను తిరిగి కైవసం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 510 రన్స్ స్కోరు చేశాడు.