మా వాళ్లు తాగలేదు

  • శ్రీలంక క్రికెట్‌ బోర్డు వివరణ

కొలంబో: ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌ సందర్భంగా న్యూయార్క్‌లోని టీమ్‌హోటల్‌ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు వివరణ ఇచ్చింది.

‘జూన్‌ 3న న్యూయా ర్క్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మందుపార్టీ చేసుకున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆటగాళ్లు తాగారని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదు’ అని పేర్కొంది.

2024-07-09T20:53:59Z